Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు.. దశాబ్ధి ఉత్సవాల పేరుతో తెలంగాణను అప్పుల పాలు చేశాడు..!
Bandi Sanjay: మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నవ్వింది.. కాని ఈరోజు స్వచ్ఛ్ భారత్ పేరుతో నవ్విన నోల్లకు తాళం వేసాడని ఆరోపించారు. అంతేకాకుండా10కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి మోడీ అని కొనియాడారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ.. ప్రపంచాన్ని కోవిడ్ నుండి కాపాడిన మహానుభావుడు మోడీ అన్నారు. ప్రపంచ దేశాలు మోడీకి పాదాభి వందనం చేస్తున్నారని.. 2వేల కోట్ల డోసుల కోవిడ్ టీకాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు బండి సంజయ్.
Read Also: Mahesh Babu: దిల్ రాజు వారసుడు ఫంక్షన్ లో.. తండ్రీకూతుళ్ళ రచ్చ
Also Read
- Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
- Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్...
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
- Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసిఆర్ ఢిల్లీకీ పోయి అడిగితే.. కేంద్రం లక్షల ఇళ్లు ఇస్తే అవి పేదలకు అందలేదన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు.. 1లక్ష ఎనభై వేలు నిరుద్యోగ భృతి ఎక్కడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా రైతులకు రుణ మాఫీ చేయలేదని.. రైతులను బీఆర్ఎస్ ఫ్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. కరీంనగర్ వచ్చి.. పంట నష్టపరిహారం ఇస్తానని రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. పారాసిటమాల్ నాయకుడు కేసీఆర్ అని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ముంచిన ఘనత కేసీఆర్ దని అన్నారు. రుణమాఫీ చేయకపోగా.. ప్రీ యూరియా అంటూ రైతులను మబ్బె పెడుతున్న మూర్ఖుడు కేసీఆర్ అని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో పర్సెటీంజీల పర్వం కొనసాగుతుందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా దశాబ్ధి ఉత్సవాల పేరుతో 5 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణను ఆగం చేసిండని కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శల జల్లు కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దాచుకుని ప్రజలను మోసం చేస్తున్న ఘనుడు కెసిఆర్ అని అన్నారు. పండించిన పంటను కొనలేని చేతకాని ప్రభుత్వం బీఆర్ఎస్ అని.. కేసీఆర్ బ్రోకర్ పనిచేయడంలో నెంబర్ వన్ అని దుయ్యబట్టారు. మరోవైపు సుశ్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చారని.. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. శ్రీకాంత్ చారి బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. కేసీఆర్ కుటుంబం ఎవ్వరూ ఉద్యమం కోసం ఎవ్వరూ పోరాడలేదని తెలిపారు…
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- kcr
- telugu news
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!