Ashok Gajapathi Raju: టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాం.. వైసీపీకి డిపాజిట్ కూడా రాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju: పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా.. అంతా కలిసి టీడీపీకి కోసం పనిచేస్తాం.. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అని జోస్యం చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ ఇస్తూ.. పలువురు నేతలు టీడీపీకి గూటికి చేరారు.. గంట్యాడ మండల వైసీపీ అధ్యక్షుడుతో సహా నలుగురు మాజీ సర్పంచులు, నలుగురు మాజీ ఎంపీటీసీలు, 16 మంది వార్డు మెంబర్లు, 50 వైసీపీ కుటుంబాలు వైసీపీకి బైబై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న 100 మందికి పైగా వైసీపీ శ్రేణులు.. ఈ సందర్బంగా అశోక్ గజపతి మాట్లాడుతూ.. టీడీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా అభ్యర్థితో కలిసి పని చేయాలని సూచించారు.
Read Also: Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ఇక, ఈ ఎన్నికల్ల వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయం అన్నారు అశోక్ గజపతిరాజు.. బీజేపీ, జనసేనతో పొత్తు ఉంది.. వారందరిలో కూడా ధైర్యాన్ని నింపండి.. గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిధులు లేక సర్పంచులు అందరూ గగ్గోలు పెడుతున్నారు.. వికేంద్రీకరణ రావాలి.. వికేంద్రీకరణ నవ్వులు పలు కాకూడదు అన్నారు. ఈ ఐదేళ్లలో పాఠశాలల్లో విద్యార్థులు గణ నేయంగా తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలి ఏట 6 లక్షల యాబై వేల మందికి, రెండో ఏట నాలుగు లక్షల మంది విద్యార్థులు బడి బయట ఉన్నారు.. ప్రాథమిక విద్యకు దూరం అవుతున్నారు.. ప్రాథమిక విద్య లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!