Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు.…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో నిర్మించిన…
విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే…
Ashok Gajapathi Raju: విజయనగరం కోటలో నూతనంగా నిర్మించిన మోతీమహల్ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే లిటరసీ ఎక్కువగా ఉన్న గోవాకు గవర్నర్గా వెళ్లడం తన అదృష్టం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసిందని విమర్శించారు. లక్షా 60 వేల హెక్టార్లలో అడవిని నరికేసిందని అన్నారు. ప్రజలకు ప్రాథమిక విద్య, ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని అన్నారు. గత…
Off The Record: ఏం…. నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇవ్వరు గవర్నర్ పదవి? గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా? నాకు మాత్రం మనసు లేదా? దానికి మనోభావాలు ఉండవా? అవి హర్ట్ అవవా అని అంటున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అశోక్గజపతికి పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోందన్నది నిజమేనా? ఎవరా టీడీపీ సీనియర్? ఎంటా వ్యథ? యనమల రామకృష్ణుడు.. టిడిపి…
గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు నియమితులపైన విషయం తెలిసిందే. నేడు ఆయనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియామకంపై అశోక్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు.
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
చోటా, మోటా నాయకులు కొందర్ని వెనకేసుకుని తిరుగుతూ అదితి ఎంకరేజ్ చేస్తున్నారని, వాళ్లేమో... పేనుకు పెత్తనం ఇచ్చిన చందాన చెలరేగిపోతున్నారన్నది విజయనగరం టీడీపీ సీనియర్స్ మాట. ప్రత్యేకించి అశోక్గజపతితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన వారిని ఇప్పుడీ ఛోటా మోటా లీడర్స్ టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే అదితి వెనక తిరుగుతున్న అనురాధ బేగం అనే నాయకురాలు బంగ్లాలో సర్వం నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. వీరందరూ సభా మర్యాదలు ఎలా పాటించాలన్న దానిపై తరగతులు నిర్వహిస్తాం.. అసెంబ్లీలో సీనియర్ నాయకుల సభలో మాట్లాడిన స్పీచులు ఉన్నాయి.