Health Tips: ప్రతిరోజూ స్నానం చేస్తున్నారా.. వచ్చే సమస్యలివే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలోనైతే రోజూ తలస్నానం చేయడం తగ్గించుకోవడం చాలా మంచిదని చర్మ నిపుణులు అంటున్నారు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల మన చర్మానికి హాని కలుగుతుందని వారు తెలుపుతున్నారు.
LIC Super Scheme: మహిళలకు అదిరిపోయే స్కీమ్.. కేవలం రూ.29 కడితే, రూ. 4 లక్షలు పొందవచ్చు..
Also Read
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
చర్మం పొడిబారే అవకాశం
చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడినీళ్లతో స్నానం చేస్తే హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. దాంతో శరీరంలో ఉండే సహజ నూనెను తొలగిస్తుంది. మన శరీరంలో ఉండే ఈ సహజ నూనె రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ నూనె మిమ్మల్ని తేమగా, రక్షణగా ఉంచుతుందని సైన్స్ చెబుతోంది. అంతేకాకుండా.. అధిక స్నానం చేయడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి జెర్మ్స్, వైరస్తో పోరాడలేకపోతుంది. దీంతో శరీరం బలహీనమవుతుంది.
గోర్లు దెబ్బతింటాయి
ప్రతిరోజూ వేడి నీటితో స్నానం మంచిది కాదు. దాని వల్ల ఎక్కువగా గోర్లు దెబ్బతినే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు గోళ్లు నీటిని పీల్చుకుంటాయి. దాంతో వాటి సహజ రూపాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందువలన మీరు ప్రతిరోజూ స్నానానికి దూరంగా ఉండాలి. రోజు విడిచి రోజు చేస్తే మంచిది.
Minister KTR: హిందూ-ముస్లింలకు గొడవలు పెట్టేవాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలి..
ఓ సర్వే ప్రకారం.. ప్రజలు ఎక్కువగా స్నానం చేసే దేశాలలో భారతదేశం, జపాన్, ఇండోనేషియా ముందు వరుసలో ఉన్నాయి. అయితే మనం రోజూ స్నానం చేయడం వల్ల నీరు వృథా కావడమే కాకుండా శారీరకంగా, మానసికంగా కూడా హానికరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. స్నానపు అలవాట్లు కూడా వ్యక్తి మానసిక స్థితి, ఉష్ణోగ్రత, వాతావరణం, లింగం, సామాజిక ఒత్తిడిపైన ఆధారపడి ఉంటాయి. సామాజిక ఒత్తిడి కారణంగా రోజూ స్నానం చేస్తుంటారు. అయితే దీన్ని బట్టి మీరు రోజూ స్నానం చేస్తారో.. రోజు విడిచి రోజు చేస్తారో మీరే ఆలోచించుకోండి.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!