Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం
- కాళేశ్వరం ప్రాజెక్టుపై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
- కమిషన్ల కోసమే నిర్మాణమని ఆరోపణ
- సీబీఐ విచారణపై బీఆర్ఎస్–బీజేపీపై విమర్శలు
- అసెంబ్లీలో చర్చకు రావాలని ప్రతిపక్షానికి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని పొంగులేటి ఆరోపించారు. “38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి, తమ రాచరికాన్ని చాటుకోవడం కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. తీరా చూస్తే ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయింది” అని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే, అందులో 50 టీఎంసీలు తిరిగి సముద్రం పాలయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరినప్పటికీ, బీఆర్ఎస్ , బీజేపీల మధ్య ఉన్న అంతర్గత ‘ఫెవికల్’ బంధం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని మంత్రి ఆరోపించారు. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగానే తాము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశామని, కానీ దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు.
“సభలో చర్చకు రమ్మంటే కుంటిసాకులు చెప్పే బావబావమరుదులు (కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి), బయట మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారు” అని పొంగులేటి ఘాటుగా విమర్శించారు. నిత్యం పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ, శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు వీరి నిజస్వరూపాన్ని చూశారు కాబట్టే అన్ని ఎన్నికల్లో ఓడగొట్టారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంత నీటిని నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వాసులకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ స్వార్థ నిర్ణయాల వల్ల రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి పోయిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరో 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పనులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!