AP Highcourt : ఏపీ హైకోర్టు మార్పుపై పార్లమెంట్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభ్యర్థన వచ్చిందా? అలా అయితే, దాని వివరాలు మరియు ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటి? అని వైఎస్సార్ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించగా.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి, 2020లో హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని ప్రతిపాదించారు. హైకోర్టు బదిలీ పై సంబంధిత హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చును భరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Also Read : Taapsee: మీడియాకు అందుకే దూరంగా ఉన్నా..!
Also Read
అదే విధంగా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ పరిపాలనను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ తమ అభిప్రాయాన్ని రూపొందించి, పూర్తి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్లో లేదు.’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానం ఇచ్చారు.
Also Read : Manipur: మణిపూర్కు డీఐజీ స్థాయి అధికారులు.. పొరుగు రాష్ట్రాల నుంచి పంపిన కేంద్రం
ఇదిలా ఉంటే.. నిన్న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో మణిపూర్ ఉదంతం కుదిపేసింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ఉభయ సభలు హోరెత్తాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడంపై ప్రతిపక్షాలు గట్టిగా గళమెత్తాయి. చర్చ జరగాల్సిందేనని.. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్పై సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో గురువారం వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలు స్తంభించిపోయాయి.
తాజావార్తలు
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..