Manipur: మణిపూర్కు డీఐజీ స్థాయి అధికారులు.. పొరుగు రాష్ట్రాల నుంచి పంపిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ హింసను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం.. చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో హింస కొనసాగుతూ .. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి.. అత్యాచారం చేసి.. హత్య చేసే స్థాయి వరకు వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇపుడు బయటికి రావడం.. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్(డీఐజీ) స్థాయి అధికారులను మణిపూర్కు తరలించాలని నిర్ణయించారు. అదీ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన డీఐజీ అధికారులను పంపించనున్నారు.
Read also: Snake Video: పనసకాయల కోసమని చెట్టెక్కితే.. పామొచ్చి దొంగను పట్టిచ్చింది
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు. అందులో భాగంగా నాగాలాండ్లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్ నుంచి ఇద్దరు డీఐజీ స్థాయి అధికారులను మణిపూర్కు పంపారు. రాష్ట్రంలోని దాదాపు 5,000 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసకొంది. దీంతోపాటు సీఆర్పీఎఫ్ కార్యకలాపాలను నిర్వహించే పరిధులను పునర్ వ్యవస్థీకరించారు. అందుకనుగుణంగా సీనియర్ అధికారులను తరలించి బాధ్యతలు అప్పగించారు. పునర్ వ్యవస్థీకరణ చేసిన పరిధిలోని సీఆర్పీఎఫ్ కార్యకలాపాలను కొత్త అధికారులు చూడనున్నారు. సీఆర్పీఎఫ్ డీజీ సుజయ్ లాల్ థోసెన్.. కేంద్ర హోంశాఖతో చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇది పూర్తిగా అసాధారణ పరిస్థితని.. గతంలో ఇక్కడ కేవలం ఆరు కంపెనీల సీఆర్పీఎఫ్ దళాలు మాత్రమే ఉండేవని.. కానీ ప్రస్తుతం 57 కంపెనీలు విధులు నిర్వహిస్తున్నాయని అని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త అధికారులు కనీసం ఆరు నెలలపాటు విధులు నిర్వహిస్తారని.. దాంతో వారు అక్కడ తగిన రీతిలో బాధ్యతలు నిర్వహంచగలుగుతారు కేంద్ర హోంశాఖ అధికారి వెల్లడించారు. ఐజీ ఆయుష్మాన్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మణిపుర్లో పరిస్థితి దృష్ట్యా సీఆర్పీఎఫ్ దళాలు భారీ ఎత్తున మోహరించాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి డీఐజీ స్థాయి అధికారుల అవసరం తీవ్రంగా ఉంది. నాగాలాండ్లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్ నుంచి డీఐజీ స్థాయి అధికారులు ఇక్కడి బాధ్యతలను స్వీకరిస్తారని పేర్కొన్నారు.
Read also: Hyderabad: మధురానగర్ లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో మహిళపై అత్యాచారం
మణిపూర్లో మే 3న రెండు తెగల మధ్య తొలుత హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్ రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మైతీ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా నిందితులను వదిలిపెట్టమని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Jyotika: సినిమాలకు బ్రేక్ తర్వాత కెమెరా ముందు భయపడ్డా..
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!