Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Mirapakaya Pachadi: ఎన్నో రకాల పచ్చళ్లలో పండు మిరపకాయ పచ్చడి రుచి ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి మరచిపోలేరు. ముఖ్యంగా సరైన కొలతలతో, తడి లేకుండా తయారు చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది. మరి పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* పండు మిరపకాయలు – ½ కేజీ
* చింతపండు (గింజలు, పీచు లేనిది) – 125 గ్రాములు
* ఉప్పు – 125 గ్రాములు
* పసుపు – 1 టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – ¼ కప్పు
* నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – 150 మి.లీ.
* మెంతుల పొడి – 1 టీస్పూన్
* ఆవాల పొడి – 1 టీస్పూన్
Also Read
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
తాలింపు కోసం:
* వెల్లుల్లి రెబ్బలు – 10
* ఎండుమిర్చి – 5
* ఆవాలు – 2 టీస్పూన్లు
* జీలకర్ర – 2 టీస్పూన్లు
* కరివేపాకు – తగినంత
* ఇంగువ – ¼ టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత వాటి తొడిమలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిరపకాయ ముక్కలు వేసి పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. తరువాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పూర్తిగా మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు జాడీలో వేసి మూతపెట్టి 24 గంటల పాటు ఊరనివ్వాలి. ఇలా ఉంచడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది.
మరుసటి రోజు పాన్లో నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేడి చేసి.. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేయాలి. ఆ తర్వాత ఊరబెట్టిన పచ్చడిని వేసి సిమ్ మంటపై సుమారు ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. చివరగా మెంతుల పొడి, ఆవాల పొడి వేసి బాగా కలిపి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలో నిల్వ చేసుకోవాలి.
పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..
పచ్చడి తయారీలో ఉపయోగించే గిన్నెలు, మిక్సీ జార్, చెంచాలు, జాడీ పూర్తిగా పొడిగా ఉండాలి. ½ కేజీ మిరపకాయలకు 125 గ్రాముల చింతపండు, 125 గ్రాముల ఉప్పు సరైన కొలత ఉండేలా చూసుకోండి. నిల్వ పచ్చళ్లకు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె మాత్రమే ఉపయోగిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు జాడీలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే సంవత్సరం పాటు రంగు, రుచి మారకుండా ఉంటుంది.
తాజావార్తలు
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
-
West Bengal R*ape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రధాన నిందితుడు పోలీసు ఎన్కౌంటర్లో మృతి
-
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
-
YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
ట్రెండింగ్
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!