Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తమిళనాడు.
- హైకోర్టు రద్దు చేసిన ప్రభుత్వ ఉత్తర్వును సవాలు.
- ఇస్లాంలోకి మారినా రిజర్వేషన్లు కొనసాగించాలని ప్రభుత్వ వాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ (BC), ఎంబీసీ (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కేటగిరీలో రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించాలని నిర్ణయించింది. సామాజికంగా వెనకబడిన వర్గాల వారికి మతమార్పిడి తర్వాత రిజర్వేషన్లు కోల్పోకుండా ఉండటమే ఈ నిర్ణయం ఉద్దేశమని అప్పటి ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ ప్రభుత్వ ఉత్వర్వులు చట్టవిరుద్ధమని మదురై బెంచ్ ప్రకటించింది. కేవలం మతం మారినంత మాత్రాన వ్యక్తి రాష్ట్రంలో గుర్తించిన ఏడు బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీల్లో సభ్యుడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అన్సార్, డెక్కని ముస్లింలు, దుబెకులా, లబ్బాయి , మాపిళ్ల, షేక్, సయ్యద్ ఏడు వర్గాలను కోర్టు పేర్కొంది. ఇవి జన్మ ఆధారిత సమాజిక వర్గాలని, మత మార్పిడి ద్వారా వీటిలో సభ్యత్వం లభించదని వెల్లడించింది. ఇస్లాం సమానత్వాన్ని బోధించే మతమని, కుల హోదానున మతమార్పిడి ద్వారా పొందలేని చెప్పింది.
Also Read
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
తమిళనాడు ప్రభుత్వం మాత్రం మత మార్పిడి జరిగినా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక్కసారిగా తొలగిపోదని సుప్రీంకోర్టులో వాదించింది. రిజర్వేషన్లు కొనసాగించడం సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణమే అని పేర్కొంది. 2015లో హిందూ మతనం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి తనకు ముస్లిం లబ్బాయి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాగా, ఎంఆర్ఓ తిరస్కరించారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా, చివరకు ప్రభుత్వ ఉత్వర్వును కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు సీఎం విజయ్ సర్కార్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తాజావార్తలు
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..