Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తమిళనాడు.
- హైకోర్టు రద్దు చేసిన ప్రభుత్వ ఉత్తర్వును సవాలు.
- ఇస్లాంలోకి మారినా రిజర్వేషన్లు కొనసాగించాలని ప్రభుత్వ వాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ (BC), ఎంబీసీ (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కేటగిరీలో రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించాలని నిర్ణయించింది. సామాజికంగా వెనకబడిన వర్గాల వారికి మతమార్పిడి తర్వాత రిజర్వేషన్లు కోల్పోకుండా ఉండటమే ఈ నిర్ణయం ఉద్దేశమని అప్పటి ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ ప్రభుత్వ ఉత్వర్వులు చట్టవిరుద్ధమని మదురై బెంచ్ ప్రకటించింది. కేవలం మతం మారినంత మాత్రాన వ్యక్తి రాష్ట్రంలో గుర్తించిన ఏడు బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీల్లో సభ్యుడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అన్సార్, డెక్కని ముస్లింలు, దుబెకులా, లబ్బాయి , మాపిళ్ల, షేక్, సయ్యద్ ఏడు వర్గాలను కోర్టు పేర్కొంది. ఇవి జన్మ ఆధారిత సమాజిక వర్గాలని, మత మార్పిడి ద్వారా వీటిలో సభ్యత్వం లభించదని వెల్లడించింది. ఇస్లాం సమానత్వాన్ని బోధించే మతమని, కుల హోదానున మతమార్పిడి ద్వారా పొందలేని చెప్పింది.
Also Read
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
- Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
- Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
తమిళనాడు ప్రభుత్వం మాత్రం మత మార్పిడి జరిగినా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక్కసారిగా తొలగిపోదని సుప్రీంకోర్టులో వాదించింది. రిజర్వేషన్లు కొనసాగించడం సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణమే అని పేర్కొంది. 2015లో హిందూ మతనం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి తనకు ముస్లిం లబ్బాయి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాగా, ఎంఆర్ఓ తిరస్కరించారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా, చివరకు ప్రభుత్వ ఉత్వర్వును కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు సీఎం విజయ్ సర్కార్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తాజావార్తలు
-
Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
-
Nokia 250 4G Smart: నోకియా 250 4G స్మార్ట్ కొత్త ఫీచర్ ఫోన్.. 1,950 mAh బ్యాటరీ, AI ఫీచర్లు, డిజిటల్ పేమెంట్స్
-
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
-
Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
-
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!