Pawan Kalyan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ నివాసంలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ఇటీవల పవన్ కల్యాణ్ రూ.కోటి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన చెక్కును నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ అందజేశారు.అనంతరం పలు కీలకాంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్ను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఓ జ్ఞాపికను పవన్కు అందజేశారు.
Read Also: Minister Narayana: ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్