IC 814 Hijack: ఐసీ 814 విమానంలో ‘రా’ ఏజెంట్.. ఉగ్రవాదులకు తెలిస్తే ఖచ్చితంగా తలనరికే వారు..
- 1999 కాందహార్ హైజాక్ ఘటన సమయంలో విమానంలో ‘రా’ ఏజెంట్..
- చివరి వరకు కూడా అతడు ఉన్న సంగతి గుర్తించని ఐఎస్ఐ..తాలిబాన్లు..
- ప్రయాణికుల లిస్ట్ వెల్లడించినప్పుడు అతడి పేరు ప్రకటించలేదు..
- రా ఏజెంట్ గురించి తెలిస్తే ఖచ్చితంగా చంపేసే వారు..
- ఆనాటి ఘటన విషయాలను పంచుకున్న రా మాజీ చీఫ్ దులత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IC 814 Hijack: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్ఫ్లి్క్స్ సిరీస్ మూలంగా మారోసారి 1999లో జరిగిన ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నాము. ఇప్పుడున్న జనరేషన్ వారికి పెద్దగా దీని గురించి తెలియదు. 8 రోజుల పాటు దేశాన్ని కలవరపరిచిన ఈ హైజాక్ ఉదంతంలో ఆనాటి సంఘటనల్ని అప్పటి అధికారులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో విమానాన్ని అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా తాలిబాల్ కంట్రోల్లోని ఆఫ్ఘనిస్తాన్ కాందహార్కి తీసుకెళ్లారు. ప్రయాణికుల్ని రక్షించేందుకు భారత్ కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది.
Read Also: Rahul Gandhi: ఇండియాకి బద్ధ వ్యతిరేకి, పాక్ మద్దతురాలు.. ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ..
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
ఆనాటి హైజాక్ ఘటనని భారత గూఢచార ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ గుర్తు చేసుకున్నారు. హైజాక్ అయిన విమానంలోనే అప్పటి ఖాట్మాండులోని రా స్టేషన్ చీఫ్ శశి భూషన్ సింగ్ తోమర్ ఉన్న విషయాన్ని చెప్పారు. ఫ్లైట్లో 16 సీ సీటులో ఉన్న ప్రయాణికుడి గురించి బయటకు విషయం పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. విమానంలో ఉన్న ప్రయాణికులు పేర్లు వెల్లడించినప్పుడు ఇతడి పేరు వెల్లడించలేదు. విమానం అమృత్సర్లో ఉన్నప్పుడు రా అధికారి విమానంలో ఉన్న విషయం ప్రభుత్వంలో తెలియదని చెప్పారు. అయితే, తనకు తెలుసని, తాను ఎవరికి చెప్పదలుచుకోలేదని, ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
రా అధికారి విమానంలో ఉన్న విషయం తాలిబాన్లు, ఐఎస్ఐకి కూడా అస్సలు తెలియదు. తోమర్ ఢిల్లీకి తిరిగి వచ్చే వరకు ఎవరికీ ఏ విషయం తెలియదని చెప్పారు. ఒక వేళ అతడి గురించి తెలిసి ఉంటే మాత్రం అతడి జీవితం ప్రమాదంలో పడేదని దులత్ చెప్పారు. ఒక గూఢచారి విమానంలో ఉన్నాడని తెలిస్తే, ఉగ్రవాదులు అతడి కళ్లకు గంతలు కట్టి, మెడపై కత్తిపెట్టి, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేవారిని చెప్పారు. అతడి తల నరికేసి ఉండేవారిని చెప్పారు. దులత్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ‘‘నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను మరియు నేను ఆ కుర్రాళ్ల కళ్లలోకి అస్సలు చూడలేదు.’’ అని చెప్పాడని దులత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!