Rahul Gandhi: ఇండియాకి బద్ధ వ్యతిరేకి, పాక్ మద్దతురాలు.. ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ..
- ఇండియా.. హిందువులు అంటే ద్వేషం..
- పాకిస్తాన్కి మద్దతురాలు ఇల్హాన్ ఒమర్..
- ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ..
- దేశవ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అని బీజేపీ విమర్శలు..
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్తో భేటీ అయ్యారు.
సాధారణంగా అమెరికాలో లామేకర్తో భేటీ అయినా కూడా పెద్దగా సమస్య ఉండకపోయేది, కానీ ఇల్హాన్ ఒమర్ని కలవడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్కి బద్ధ వ్యతిరేకి, పాకిస్తాన్కి వంతపాడేదిగా పేరున్న ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదాస్పదమైంది. ఈమె ఒకసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పర్యటించింది. ఆమె పర్యటనను దగ్గరుండీ పాకిస్తాన్ స్పాన్సర్ చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా, పాక్కి అనుకూటంగా అమెరికా చట్ట సభల్లో పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా చట్టసభల్ని ఉద్దేశించి మాట్లాడటాన్ని కూడా వ్యతిరేకించింది. డోనాల్ ట్రంప్ ఒమర్ని తీరును పలు సందర్భాల్లో అసహ్యించుకున్నాడు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Earthquake: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంప ప్రకంపనలు..
ఇలాంటి వ్యక్తిలో రాహుల్ గాంధీ భేటీ కావడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. ‘‘భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ USAలో పాకిస్తాన్ ప్రాయోజిత భారత వ్యతిరేక గొంతు, రాడికల్ ఇస్లామిస్ట్, స్వతంత్ర కాశ్మీర్ యొక్క న్యాయవాది అయిన ఇల్హాన్ ఒమర్ను కలిశారు. పాకిస్తానీ నాయకులు కూడా ఇలాంటి ఆవేశపూరిత అంశాలతో కనిపించడం పట్ల మరింత నిశితంగా ఉంటారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా బహిరంగంగా పనిచేస్తోంది’’ అని బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘”సిక్కులపై విషం చిమ్మిన తర్వాత మరియు విదేశీ గడ్డపై భారతదేశాన్ని చంపిన తర్వాత, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత వ్యతిరేక ఇల్హాన్ ఒమర్తో సమావేశమయ్యారు మరియు నిమగ్నమయ్యారు – 1) ఇల్హాన్ US కాంగ్రెస్లో భారత వ్యతిరేక తీర్మానాలను ప్రవేశపెట్టారు 2) ఆమె ఆర్ట్ 370 3 రద్దుకు వ్యతిరేకంగా ఉంది. ) ఆమె భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది, పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన పర్యటనలో పీఓకేని సందర్శించింది 4) భారతదేశంలో “ఇస్లామోఫోబియా” గురించి చర్చించడానికి ఆమె ఇమ్రాన్ ఖాన్ని కలిశారు 5) హిందువులపై ద్వేషం పెంచడంలో ఆమె కీలక పాత్ర పోషించింది, రాహుల్ గాంధీ ఆమెను ఎందుకు కలవాల్సి వచ్చింది ప్రతి విదేశీ పర్యటనలో ఆయన అత్యంత తీవ్రమైన భారత వ్యతిరేక అంశాలతో ఎందుకు నిమగ్నమై ఉన్నారు – దేశ్ వ్యతిరేక్ ఓకే?’’ అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!