Earthquake: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంప ప్రకంపనలు..
- ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది.
- రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం డేరా ఘాజీ ఖాన్ సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. దీని కారణంగా తీవ్రత తక్కువగా కనిపించింది.
Rohit Sharma: రోహిత్ ఇంట్రెస్టింగ్ వీడియో.. 99% వర్కౌట్ టైమ్.. ఆ 1% అలా..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ప్రస్తుతం భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఎక్కడ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం సమయం 12:58 నిమిషాలకు నమోదైంది. భూకంప తీవ్రత 6 కంటే తక్కువగా ఉంటే పెద్దగా ప్రమాదం ఉండదని సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. కానీ ఈ భూకంపం యొక్క కేంద్రం భూమికి చాలా దిగువన లేదు. కాబట్టి, ఇది ప్రమాదకరంగా ఉండవచ్చు. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
Delhi Traffic Jam : వర్షంతో ఢిల్లీ రోడ్లు జామ్.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
భూకంప తీవ్రత 5.8 కాదని, 5.4గా ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పాకిస్థాన్ పంజాబ్లోని చాలా నగరాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. వీటిలో మియాన్వాలి, ఖనేవాల్, తోబా టేక్ సింగ్, గుజరాత్, సర్గోధా, ఝాంగ్ ఉన్నాయి. దీంతో పాటు రాజధాని ఇస్లామాబాద్, ముల్తాన్, లాహోర్లలో కూడా భూకంపం సంభవించింది. ఖైబర్ ఫక్తుంఖ్వాలోని పెషావర్తో పాటు స్వాత్ వ్యాలీ, ఉత్తర వజీరిస్థాన్ తదితర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?