YSRCP Final Candidates List: నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Final Candidates List: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మార్పుచేర్పుల్లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక, ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: Arvind Kejriwal : నేడు కోర్టుకు హాజరుకానున్న సీఎం కేజ్రీవాల్
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ఉదయం 10గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు రానున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్తారు. 12 గంటల 40 నిమిషాలకు వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుంచి ఒంటి గంటా 20 నిమిషాల వరకు వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత కాసేపు గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి కడపకు బయల్దేరతారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం వెళ్తారు.
Read Also:RCB vs MI: ఎలిమినేటర్లో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి బెంగళూరు!
శనివారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన సందర్భంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది వైసీపీ. ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటనకోసం.. కడప జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. వైఎస్ సమాధి వద్ద రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే, వేదికపై 11 మందికి మాత్రమే కూర్చునే లా ఏర్పాట్లు చేశారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చింది వైసీపీ.. పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గత ఎన్నికల సమయంలోనూ జగన్.. పార్టీ అభ్యర్థులను ఇలానే ప్రకటించారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?