Purandeshwari: అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeshwari: విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు. పార్టీ పునాది బాగుంటే గాలి అనే మాట ఉండదు.. ఏ పార్టీ వైపు గాలి వీచినా మనం ఎంత బలంగా ఉన్నామో తెలుస్తుందన్నారు.
Also Read: AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
Also Read
హోం మంత్రి వనిత వేధింపులతో ఓ ఎస్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని.. సామాజిక బస్సు యాత్ర వైసీపీ చేపడుతోందని.. మరి ఆ కుర్రోడికి సామాజికంగా ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో రాజకీయ పార్టీలు ఒక అపోహ సృష్టించారని.. ఆ సమయంలో బీజేపీని దోషిగా చూపించడంలో సఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి, రోడ్లకు 500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందన్నారు. రాజధానిలో మౌళిక సదుపాయాల కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసపాలన సాగుతోందన్నారు.
రాజమండ్రిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయని.. రైతులు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. నోరు విప్పితే సమాధానం చెప్పరు కాని వ్యక్తి గత ధూషణలకు దిగుతూ ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లంతా ప్రతి సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెల్లడించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!