AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ministers: ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను చూశాక చంద్రబాబు ఎంత దోచుకు తిన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన విమర్శించారు. జగన్కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదన్న ఆయన.. పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యమన్నారు.
Also Read: Purandeswari: కంపెనీ పేరు లేకుండా బిల్స్.. అక్రమంగా ఇసుక తవ్వకాలు..!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
పేదల ఆరోగ్యం, చదువుకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. కులాల స్థితిగతులు మెరుగు పడ్డాయని అంటే సీఎం జగన్ కారణమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరమని.. ఎంత మంది కలసి వచ్చినా జగన్ను ఎలా కాపాడుకోవాలి అనేది ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
సామాజిక సాధికారత అంటే చంద్రబాబు దృష్టిలో ఆయన కులాన్ని మాత్రమే ఉద్ధరించడమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎస్సీలు, బీసీలను బానిసలుగా చూడాలనే భావజాలం చంద్రబాబుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత కోరుకున్న విధంగా అన్ని రంగాల్లోనూ అన్ని కులాలకు ప్రాధాన్యత సీఎం జగన్ కల్పిస్తున్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే ఓట్లు వేసేవాళ్ళు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీలో అచ్చెన్నాయుడిని పక్కకి తోసేశారని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో బీసీలకే ప్రధానమైన మంత్రి పదవులు దక్కాయన్నారు. జగన్ వెంట జనం ఉన్నారన్న మంత్రి.. అబద్ధపు చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!