AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ministers: ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను చూశాక చంద్రబాబు ఎంత దోచుకు తిన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన విమర్శించారు. జగన్కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదన్న ఆయన.. పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యమన్నారు.
Also Read: Purandeswari: కంపెనీ పేరు లేకుండా బిల్స్.. అక్రమంగా ఇసుక తవ్వకాలు..!
Also Read
పేదల ఆరోగ్యం, చదువుకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. కులాల స్థితిగతులు మెరుగు పడ్డాయని అంటే సీఎం జగన్ కారణమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరమని.. ఎంత మంది కలసి వచ్చినా జగన్ను ఎలా కాపాడుకోవాలి అనేది ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
సామాజిక సాధికారత అంటే చంద్రబాబు దృష్టిలో ఆయన కులాన్ని మాత్రమే ఉద్ధరించడమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎస్సీలు, బీసీలను బానిసలుగా చూడాలనే భావజాలం చంద్రబాబుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత కోరుకున్న విధంగా అన్ని రంగాల్లోనూ అన్ని కులాలకు ప్రాధాన్యత సీఎం జగన్ కల్పిస్తున్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే ఓట్లు వేసేవాళ్ళు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీలో అచ్చెన్నాయుడిని పక్కకి తోసేశారని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో బీసీలకే ప్రధానమైన మంత్రి పదవులు దక్కాయన్నారు. జగన్ వెంట జనం ఉన్నారన్న మంత్రి.. అబద్ధపు చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!