Air India: గల్ఫ్ వెళ్లే వారికి బ్యాడ్ న్యూస్.. రన్ వే పైనే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు! అసలు కారణమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.
READ ALSO: Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
Also Read
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
ఆపరేషన్ రోరింగ్ లయన్..
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రోరింగ్ లయన్” ఇరాన్పై దాడులను ఉధృతం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతమంతా గగనతలం (Airspace) మూతపడింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI139), గగనతలంలో ప్రమాదాన్ని పసిగట్టి మధ్యలోనే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖతార్ (దోహా), ఒమన్ (మస్కట్), ఇజ్రాయెల్ (టెల్ అవీవ్)లకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో కూడా అప్రమత్తమైంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా స్థితిగతులను నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన వేళల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిని (Flight Status) ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే బ్రిటన్.. ఇరాన్ నుంచి తన సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఫ్రాన్స్ & ఇటలీ కూడా తమ పౌరులను తక్షణమే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాలను విడిచి రావాలని ఆదేశించాయి. జర్మనీ.. ఇజ్రాయెల్ ప్రయాణాలపై కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మీరు గల్ఫ్ దేశాలకు ప్రయాణించాల్సి ఉంటే, విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్లో మీ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!