Air India: గల్ఫ్ వెళ్లే వారికి బ్యాడ్ న్యూస్.. రన్ వే పైనే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు! అసలు కారణమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.
READ ALSO: Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ఆపరేషన్ రోరింగ్ లయన్..
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రోరింగ్ లయన్” ఇరాన్పై దాడులను ఉధృతం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతమంతా గగనతలం (Airspace) మూతపడింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI139), గగనతలంలో ప్రమాదాన్ని పసిగట్టి మధ్యలోనే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖతార్ (దోహా), ఒమన్ (మస్కట్), ఇజ్రాయెల్ (టెల్ అవీవ్)లకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో కూడా అప్రమత్తమైంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా స్థితిగతులను నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన వేళల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిని (Flight Status) ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే బ్రిటన్.. ఇరాన్ నుంచి తన సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఫ్రాన్స్ & ఇటలీ కూడా తమ పౌరులను తక్షణమే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాలను విడిచి రావాలని ఆదేశించాయి. జర్మనీ.. ఇజ్రాయెల్ ప్రయాణాలపై కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మీరు గల్ఫ్ దేశాలకు ప్రయాణించాల్సి ఉంటే, విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్లో మీ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!