Pawan Kalyan Varahi Yatra: వారాహి యాత్రకు పర్మిషన్ ఇస్తారా? లేదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Varahi Yatra: వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని చెబుతున్న జనసేనాని… ఈ నెల 14న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్రతో ప్రచారం చేపట్టనున్నారు. వారాహి యాత్రకు ముందు..అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరుతూ హోమం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేశారు. పార్టీ కార్యాలయంలోని ఆఫీసు ప్రాంగణంలో… భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
Read Also: Mahesh fans : త్రివిక్రమ్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..?
Also Read
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ ఒక రోజు ముందుగా మంగళవారం మధ్యాహ్నానికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేరుకుంటారు. అయితే కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తుండడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సెక్షన్ 30 ఈ నెలాఖరు వరకు అమల్లో ఉండనుంది. సెక్షన్ 30 అమల్లో ఉన్నంతసేపు అనుమతులు లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదంటున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే మినిట్ టు మినిట్ షెడ్యూల్తో వారాహి యాత్ర, సభలను సక్సెస్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసిన జనసేన శ్రేణులు…పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. అటు పోలీసు అధికారుల వాదన మరోలో ఉంది. పవన్ వారాహి యాత్రపై జనసేన నేతలు తమకు ముందస్తు సమాచారం మాత్రమే ఇచ్చారంటున్నారు. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటే మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వాల్సిందేనంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలని చెప్పారే కానీ ఎక్కడ చేస్తారో చెప్పలేదని, మైక్ పర్మిషన్కు సంబంధించి అనుమతులు అడగలేదనేది పోలీసు అధికారుల వాదనగా ఉంది.
Read Also: YSRCP vs BJP: ఏపీలో హీటెక్కిన రాజకీయం.. బీజేపీ వర్సెస్ వైసీపీ..!
అయితే వారాహి యాత్రపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఇచ్చేశామని, ఎక్కడికక్కడే డీఎస్పీలకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు జనసేన నేతలు. ఎన్ని ఆటంకాలు పెట్టినా వారాహి యాత్ర ఆగదని చెబుతున్నారు. జనసేన నేతల మాటెలా ఉన్నా.. వారాహి యాత్ర, సభలకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఇప్పుడు పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఈ నెల 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు చేశాక వారాహి యాత్ర మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు..ఈ 8 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర జరుగుతోంది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రతో జనసేన శ్రేణుల్లో జోష్ తేవడంతో పాటు..మేనిఫెస్టోకు పవన్ కసరత్తు చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!