Fake ACB Officer Case: విశాఖపట్నంలో నకిలీ ఏసీబీ అధికారి కలకలం సృష్టించాడు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్ చాలాకాలం కిందట విశాఖలోని ఆదర్శనగర్ పాత డెయిరీఫారం వద్ద నివాసం ఉంటుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.. ఇక, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, జాయింట్ సబ్రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి.. తాను ఏసీబీ ఇన్స్పెక్టర్నని పరిచయం చేసుకుని.. మీ ఆఫీస్లో అవినీతిపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదుచేయాల్సి ఉందంటూ బెదరించాడు.. అయితే, ఏసీబీ అధికారినంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన అతడిని విశాఖ పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే, నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు..
Read Also: Guntur Crime: ట్రాంజెండర్తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
ఆ కిలాడీ లేడీ ఖాకీ ఎవరో కాదు.. గతంలో నోట్ల మార్పిడి కేసులో సంచలనంగా మారిన రిజర్వుడు ఇన్స్పెక్టర్ స్వర్ణలత.. ఈ ఘటనతో లేడీ పోలీస్ స్వర్ణలత తన తీరు మార్చుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్లొచ్చినా ఆమె వ్యవహార శైలిలో మార్పురాలేదట.. నోట్ల మార్పిడి కేసులో గతంలో సంచలనంగా మారిన స్వర్ణలత పేరు మరోసారి తెర పైకి వచ్చింది.. మధురవాడ సబ్ రిజిస్టర్ను బెదిరించిన కేసులో ఈమె పాత్ర ఉందని తేల్చారు పోలీసులు… నకిలీ ఏసీబీ సుధాకర్ ను అడ్డుపెట్టుకొని డబ్బుల కోసం ఈ ఆగడాలకు దిగారట.. సుధాకార్ కాల్ లిస్ట్ ఆధారంగా స్వర్ణలత బండారం బట్ట బయలు అయినట్టు అయ్యింది.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు స్వర్ణలత.. ఈ వ్యవహారంలో వెలుగు చూడడంతో కిలేడీ లేడీ పోలీస్ పరారీలో ఉన్నారట.. దీంతో, స్వర్ణలత కోసం పోలీసుల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.. మొత్తంగా నకిలీ ఏసీబీ కేసులో.. కిలాడీ లేడీ ఖాకీ స్వర్ణలత వ్యవహారం వెలుగు చూడడంతో ఊహించని ట్విస్ట్ వచ్చినట్టు అయ్యింది..