Rahul Gandhi: రాహుల్గాంధీకి షాక్.. నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ
- రాహుల్గాంధీకి షాక్
- నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ
- పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్గాంధీకి నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. పదే పదే విచారణకు హాజరుకాకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Genelia : తృటిలో తప్పిన ప్రమాదం.. కొడుకుతో సహా ప్రాణాలతో బయటపడ్డ జెనీలియా
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్గాంధీపై బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా బీజేపీలో అధ్యక్షులు కావొచ్చని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రతాప్ కటియార్ పిటిషన్లో పేర్కొ్న్నారు. ఈ మేరకు జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తదనంతరం కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపారు. మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాహుల్గాంధీకి సమన్లుజారీ చేశారు.
ఇది కూడా చదవండి: KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం
అయితే పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. ఆ తర్వాత వారెంట్పై స్టే కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను మార్చి 20, 2024న కొట్టివేసింది. తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని చైబాసా కోర్టు కూడా తోసిపుచ్చింది. తాజాగా నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!