కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్గాంధీకి నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. పదే పదే విచారణకు హాజరుకాకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Genelia : తృటిలో తప్పిన ప్రమాదం.. కొడుకుతో సహా ప్రాణాలతో బయటపడ్డ జెనీలియా
2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్గాంధీపై బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా బీజేపీలో అధ్యక్షులు కావొచ్చని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రతాప్ కటియార్ పిటిషన్లో పేర్కొ్న్నారు. ఈ మేరకు జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తదనంతరం కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపారు. మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాహుల్గాంధీకి సమన్లుజారీ చేశారు.
ఇది కూడా చదవండి: KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం
అయితే పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. ఆ తర్వాత వారెంట్పై స్టే కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను మార్చి 20, 2024న కొట్టివేసింది. తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని చైబాసా కోర్టు కూడా తోసిపుచ్చింది. తాజాగా నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.