Joshimath Land Subsidence: జోషీమఠ్లో ఇళ్లకు పగుళ్లు.. 600 కుటుంబాలు ఖాళీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath Land Subsidence: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం జోషిమఠ్ పట్టణంలో భారీ పగుళ్లు ఏర్పడి ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 600 కుటుంబాలను వెంటనే ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు. ప్రాణాలను రక్షించడం మొదటి ప్రాధాన్యత అని.. జోషిమఠ్లో పగుళ్లు ఏర్పడిన ఇళ్లలో నివసిస్తున్న సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు. ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో భూమి కుంగిపోతున్న పట్టణంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.
జోషిమత్లో పరిస్థితిని పరిష్కరించడానికి తాము స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి శనివారం జోషిమఠ్ను సందర్శించి, బాధిత ప్రజలను కలుసుకుని అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గర్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రంజిత్ కుమార్ సిన్హా, నిపుణుల బృందంతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు మైదానంలో క్యాంప్ చేస్తున్నామని ధామి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను త్వరితగతిన తరలించాలని అధికారులకు సూచించారు. గ్రౌండ్లో వైద్య చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, ప్రజలను ఎయిర్లిఫ్టింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. తక్షణ కార్యాచరణ ప్రణాళిక, అలాగే దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రెండింటిపై సరైన శ్రద్ధతో పని ప్రారంభించాలని ధామి చెప్పారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Man Vandalises Temples: మొక్కినా కోరిక నెరవేరలేదని..! దేవుడినే టార్గెట్ చేశాడుగా..
డేంజర్ జోన్లు, మురుగు కాలువలు, డ్రైనేజీల ట్రీట్మెంట్పై పనిని వేగవంతం చేయడానికి విధానాలను సరళీకృతం చేయాలన్నారు. జోషిమఠ్ను సెక్టార్లు, జోన్లుగా విభజించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని, పట్టణంలో విపత్తు నియంత్రణ గదిని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బాధిత ప్రజలకు శాశ్వత పునరావాసం కోసం పిప్పల్కోటి, గౌచర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, సంభావ్య ప్రమాదకర మండలాలను కూడా గుర్తించాలన్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అవసరమని, శాటిలైట్ చిత్రాలు కూడా ఇందులో ఉపయోగపడతాయని, అన్ని విభాగాలు టీమ్ స్పిరిట్తో కసరత్తులో విజయం సాధించాలని సూచించారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని తగినంతగా మోహరించాలని, అవసరమైతే హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. జోషిమఠ్ ధార్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పట్టణమని, ప్రజల జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Viral Video: బైక్ ఎక్కలేదని మహిళను హెల్మెట్తో చితకబాదాడు.. వీడియో వైరల్
జోషిమఠ్లోని సింధర్ వార్డులో శుక్రవారం సాయంత్రం ఒక ఆలయం కూలిపోవడంతో పెద్ద విపత్తు సంభవిస్తుందనే భయంతో నివసిస్తున్న నివాసితులను మరింత ఆందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తూ ఆలయం కూలిపోయే సమయానికి లోపల ఎవరూ లేరని, గత 15 రోజులుగా పెద్ద పగుళ్లు ఏర్పడిన తరువాత దానిని వదిలివేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. అనేక ఇళ్లలో భారీ పగుళ్లు ఏర్పడగా చాలా మంది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాదాపు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు విష్ణు ప్రయాగ్ జల్ విద్యుత్ పరియోజన ఉద్యోగుల కోసం ఉద్దేశించిన కాలనీలో నివసిస్తున్న 60 కుటుంబాలను వేరే చోటికి తరలించినట్లు దాని డైరెక్టర్ పంకజ్ చౌహాన్ తెలిపారు. మార్వాడీ ప్రాంతంలో మూడు రోజుల క్రితం జలధార పగిలిపోవడంతో నిత్యం నీరు దిగువకు వస్తుండడంతో అతలాకుతలమైంది.
ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నివాసితుల ఆందోళనల నేపథ్యంలో చార్ధామ్ ఆల్ వెదర్ రోడ్, ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ వంటి మెగా ప్రాజెక్ట్లకు సంబంధించిన అన్ని నిర్మాణ కార్యకలాపాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయబడ్డాయి. ఆసియాలోనే అతి పెద్దదైన ఔలీ రోప్వే కింద భారీ పగుళ్లు ఏర్పడటంతో ఆపివేసినట్లు స్థానిక మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు రిషి ప్రసాద్ సతీ తెలిపారు. ఏడాదిన్నరగా భూమి ముంపునకు గురవుతున్నప్పటికీ గత పక్షం రోజులుగా సమస్య తీవ్రరూపం దాల్చిందని తెలిపారు. కాగా, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ జోషిమఠ్లోని తహసీల్ కార్యాలయం వద్ద ప్రజలు ధర్నా చేయడంతో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. జోషిమఠ్ పతనావస్థ తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అంచనా వేయడానికి బీజేపీ కూడా ఓ బృందాన్ని పట్టణానికి పంపింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?