ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జనవరి 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జోషిమఠ్లో భూమి క్షీణించడం వల్ల పెను సవాలు ఎదురవుతోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం జోషిమఠ్ పట్టణంలో భారీ పగుళ్లు ఏర్పడి ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 600 కుటుంబాలను వెంటనే ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషీమఠ్ నగరంలో భూమి కుంగిపోవడం కలకలం రేపుతోంది. భూమి కుంగడం వల్ల దాదాపు 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.