Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)
- పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో ఆశ్చర్యకర ఘటన
- అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసిన బిచ్చగాడు
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన వార్త
- 20 వేల మంది అతిథులకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో ఒక బిచ్చగాడు తన అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిచ్చగాడి అమ్మమ్మ ఇటీవల మరణించింది. ఆమె మరణించిన 40వ రోజున, ఈ వ్యక్తి తన అమ్మమ్మ జ్ఞాపకార్థం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందులో సిరి పాయ, మురబ్బా, మటన్, నాన్-బఠానీ గంజ్ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల మాంసాహార, తీపి వంటకాలు అందించాడు.
20 వేల మంది అతిథులకు ఆహ్వానం
బిచ్చగాడు విందును నిర్వహించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 20,000 మందిని ఆహ్వానించాడు. అతిథులను వేదిక వద్దకు చేర్చేందుకు 2 వేలకు పైగా వాహనాలను ఏర్పాటు చేశాడు. గుజ్రాన్వాలా రైల్వే స్టేషన్కు సమీపంలోని ఖాళీ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రజలు గొప్ప విందును ఆనందించారు.
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక బిచ్చగాడికి అంత డబ్బు ఎలా వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమ్మమ్మ స్మారకార్థం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంపై కొందరు ప్రశంసించారు.
అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే ఈ బిచ్చగాడు ఇంత భారీ మొత్తాన్ని ఎలా వసూలు చేశాడనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆమె అమ్మమ్మ పట్ల ఉన్న ప్రేమ, భక్తి సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ ఘటన దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా బిచ్చగాడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడనే ప్రశ్న కూడా చాలా మందిలో తలెత్తుతోంది. అయితే ఈ మొత్తం విందు ధర రూ.1.25 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Beggars of Gujranwala spent 200 million rupees on mother's chelum.800 beggars from all over the country participated , served breakfast for guests in the chelum ceremony, while 250 goats were served in the evening meal. In addition, various species were arranged !#Gujranwala pic.twitter.com/wmVdFVBeLW
— Shehzad Qureshi (@ShehxadGulHasen) November 16, 2024
گوجرانوالہ بھیک مانگنے والوں نے اپنی دادی کے ختم پر سوا کروڑ روپیہ خرچ کر کے تاریخ رقم کر دی تقریب میں مہمانوں کو صبح ناشتے میں سری پائے جبکہ شام کے کھانے میں اڑھائی سو بکرا ذبح کیا مہمانوں کو کھانے میں نان چاول گاجر سیب کا مربع اور تمام قسم کے مشروبات پیش کیے گئے۔ pic.twitter.com/L5hIr8LLyd
— G O L D E N H O R D E (@Javediqbal44300) November 16, 2024
తాజావార్తలు
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!