Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)
- పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో ఆశ్చర్యకర ఘటన
- అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసిన బిచ్చగాడు
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన వార్త
- 20 వేల మంది అతిథులకు ఆహ్వానం
పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో ఒక బిచ్చగాడు తన అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిచ్చగాడి అమ్మమ్మ ఇటీవల మరణించింది. ఆమె మరణించిన 40వ రోజున, ఈ వ్యక్తి తన అమ్మమ్మ జ్ఞాపకార్థం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందులో సిరి పాయ, మురబ్బా, మటన్, నాన్-బఠానీ గంజ్ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల మాంసాహార, తీపి వంటకాలు అందించాడు.
20 వేల మంది అతిథులకు ఆహ్వానం
బిచ్చగాడు విందును నిర్వహించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 20,000 మందిని ఆహ్వానించాడు. అతిథులను వేదిక వద్దకు చేర్చేందుకు 2 వేలకు పైగా వాహనాలను ఏర్పాటు చేశాడు. గుజ్రాన్వాలా రైల్వే స్టేషన్కు సమీపంలోని ఖాళీ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రజలు గొప్ప విందును ఆనందించారు.
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక బిచ్చగాడికి అంత డబ్బు ఎలా వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమ్మమ్మ స్మారకార్థం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంపై కొందరు ప్రశంసించారు.
అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే ఈ బిచ్చగాడు ఇంత భారీ మొత్తాన్ని ఎలా వసూలు చేశాడనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆమె అమ్మమ్మ పట్ల ఉన్న ప్రేమ, భక్తి సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ ఘటన దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా బిచ్చగాడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడనే ప్రశ్న కూడా చాలా మందిలో తలెత్తుతోంది. అయితే ఈ మొత్తం విందు ధర రూ.1.25 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Beggars of Gujranwala spent 200 million rupees on mother's chelum.800 beggars from all over the country participated , served breakfast for guests in the chelum ceremony, while 250 goats were served in the evening meal. In addition, various species were arranged !#Gujranwala pic.twitter.com/wmVdFVBeLW
— Shehzad Qureshi (@ShehxadGulHasen) November 16, 2024
گوجرانوالہ بھیک مانگنے والوں نے اپنی دادی کے ختم پر سوا کروڑ روپیہ خرچ کر کے تاریخ رقم کر دی تقریب میں مہمانوں کو صبح ناشتے میں سری پائے جبکہ شام کے کھانے میں اڑھائی سو بکرا ذبح کیا مہمانوں کو کھانے میں نان چاول گاجر سیب کا مربع اور تمام قسم کے مشروبات پیش کیے گئے۔ pic.twitter.com/L5hIr8LLyd
— G O L D E N H O R D E (@Javediqbal44300) November 16, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!