Maharashtra Elections: చరిత్ర సృష్టించిన “మహా” ఓటర్లు.. దశాబ్ధం తర్వాత ఎక్కువ ఓటింగ్ శాతం..
- దశాబ్ధం తర్వాత చరిత్ర సృష్టించి ‘‘మహా’’ ఓటర్లు..
- 1995 తర్వాత అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన పోలింగ్లో ఏకంగా 65.1 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. 1995 ఎన్నికల్లో 71.5 శాతం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. దశాబ్ధం తర్వాత ఇంతలా ఓటింగ్ శాతం పెరగడం ఇదే తొలిసారి.
Read Also: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
2004, 2014 ఎన్నికల్లో 63.4 శాతం ఓటింగ్ నమోదైంది. 1995లో అత్యధికంగా 71.5 శాతం ఉన్న పోలింగ్ శాతం, 1999లో 61కి పడిపోయింది. 2009లో 59.7 శాతంగా నమోదైంది. 2014లో 63.4 శాతానికి చేరుకుంది. 2019లో 61.4 శాతంగా నమోదైంది. నిజానికి అధిక ఓటింగ్ అనేది అధికారంలో ఉన్న వారికి ప్రమాదం అని సూచిస్తారు, అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ బీజేపీ కూటమికి దెబ్బపడింది. అన్ని సందర్భాల్లో ఓటింగ్ శాతం అనేది కీలకం కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో అత్యధికంగా 70 శాతం ఓటింగ్ నమోదైంది. రాజధాని ముంబైలో మాత్రం కేవలం 54 శాతం మాత్రమే నమోదైంది. 2019తో పోలిస్తే(50.67) శాతం కన్నా ఎక్కువగానే ఓట్లేశారు. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఓటేయకపోవడం గమనార్హం. ముంబైలోని కలాబా సీటులో కేవలం 44.5 శాతం మాత్రమే ఓటింగ్ నమైదైంది. ముంబైలోని సబర్బన్లో 39.34 శాతం పోలింగ్ నమోదైంది. 46 స్థానాలున్న మరఠ్వాడా రీజియన్లో 20 స్థానాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ఈ 20 స్థానాల్లో 17 మంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!