Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి
- ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు
- యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు
- ఈ పద్ధతులను అనుసరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spotless Face Tips: ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత తినే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే, వాటిని ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడి వాటిని నివారించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దామా.
Also Read: Curry Leaves: కరివేపాకే కదా అని తీసి పారేస్తున్నారా? బరువు తగ్గడానికి అది ఎలా సహాయపడుతుందంటే?
Also Read
ముఖంపై మచ్చలు తగ్గాలంటే నిమ్మరసం వాడాలి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. దీని కోసం, నిమ్మరసంలో కొంత నీరు మిక్స్ చేసి, ఆపై దూది సహాయంతో మచ్చలపై రాయండి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే ముఖంపై మొటిమలు, దద్దుర్లు, మచ్చలు వంటి అన్ని సమస్యలను తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. అలోవెరా చర్మాన్ని తేమగా, హైడ్రేట్ చేస్తుంది. మీరు అలోవెరా జెల్ను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
Also Read: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చక్కెర, తేనెతో మీ ముఖాన్ని స్క్రబ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే, ఓట్ మీల్ ఒక గొప్ప ఎక్స్ఫోలియేటర్, క్లెన్సర్. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు ఓట్ మీల్ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఓట్ మీల్ లో మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు పెరుగును ఉపయోగించవచ్చు. పెరుగును ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీటితో కడిగేయాలి. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. దాంతో మొటిమలు, మచ్చలను కూడా తొలగిస్తుంది.
తాజావార్తలు
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!