Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి
- ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు
- యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు
- ఈ పద్ధతులను అనుసరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spotless Face Tips: ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత తినే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే, వాటిని ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడి వాటిని నివారించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దామా.
Also Read: Curry Leaves: కరివేపాకే కదా అని తీసి పారేస్తున్నారా? బరువు తగ్గడానికి అది ఎలా సహాయపడుతుందంటే?
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ముఖంపై మచ్చలు తగ్గాలంటే నిమ్మరసం వాడాలి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. దీని కోసం, నిమ్మరసంలో కొంత నీరు మిక్స్ చేసి, ఆపై దూది సహాయంతో మచ్చలపై రాయండి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే ముఖంపై మొటిమలు, దద్దుర్లు, మచ్చలు వంటి అన్ని సమస్యలను తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. అలోవెరా చర్మాన్ని తేమగా, హైడ్రేట్ చేస్తుంది. మీరు అలోవెరా జెల్ను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
Also Read: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చక్కెర, తేనెతో మీ ముఖాన్ని స్క్రబ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే, ఓట్ మీల్ ఒక గొప్ప ఎక్స్ఫోలియేటర్, క్లెన్సర్. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు ఓట్ మీల్ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఓట్ మీల్ లో మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు పెరుగును ఉపయోగించవచ్చు. పెరుగును ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీటితో కడిగేయాలి. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. దాంతో మొటిమలు, మచ్చలను కూడా తొలగిస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!