Gautam Adani: ట్రంప్కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?
- అదానీపై అమెరికా కుట్ర చేస్తోందా..?
- ట్రంప్కి మద్దతు తెలిపిన అదానీ..
- అందుకే భారత వ్యాపారుల్ని టార్గెట్ చేస్తుందా..?
- ఓ వర్గం నుంచి కుట్ర ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన అజూర్ పవర్తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్టీ, SECIతో 12 GW సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది.
అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణల్లో అమెరికాలోని జోబైడెన్ ప్రభుత్వ కుట్ర ఏమైనా ఉందా..? అని ఓ వర్గం చర్చిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ని చంపేందుకు కాల్పులు జరిగాయి. తృటిలో ట్రంప్ తప్పించుకున్నాడు. ఆ సమయంలో అదానీ ట్రంప్కి మద్దతుగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని డెమెక్రాట్లకు, డెమెక్రాట్ లాబీయిస్టులకు మద్దతుతో చైనాకు కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
Read Also: Galla Ashok: దేవకీ నందన వాసుదేవ’ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి!
దీంతో పాటు చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అదానీ కొలంబోలో ఒక ఓడరేవును, ఇజ్రాయిల్ హైఫాలో, టాంజానియాల్లో ఓడరేవుల్ని నిర్మిస్తున్నాడు. ఇది భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్వరలో దిగిపోబోతున్న బైడెన్ ప్రభుత్వం కావాలనే ఈ ఆరోపణలు చేస్తోందని కొందరు తమ వాదనని వినిపిస్తున్నారు. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్టులాగే తాజా ఆరోపణలు భారతీయ వ్యాపారుల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడుతున్నారు.
దీనికి తోడు మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు రావడం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీని అస్థిరపరిచే కుట్రగా అభివర్ణిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు వంటి కీలక బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. ఈ లోపే అదానీ కేంద్రంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఈ అన్ని పరిణామాలు కూడా కుట్ర కోణం ఏదైనా ఉందా..? అనే అనుమానాలనున లేవనెత్తుతున్నాయి.
అదానీపై నేరాలు మోపిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్. ఇతడికి డెమెక్రాట్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. బ్రియాన్ పీస్కి డెమెక్రాట్ సెనెటర్ చక్ షుమెర్తో చాలా సంబంధాలు ఉన్నాయి. పీస్ జ్యుడిషియల్ నియామకంలో షుమెర్ పాత్ర ఉంది. ఇతడి నియామకంపై 2021లో వివాదం చెలరేగితే, షమెర్ మద్దతు తెలిపాడు. దీనిని బట్టి చూస్తే అదానీపై కేసులో పొలిటికల్ ఎజెండా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ షెమెర్కి డీప్ స్టేట్ని నడిపిస్తున్న బిలియనీర్ జార్జ్ సోరెస్తో సంబంధం ఉంది. సోరొస్ కొడుకు అలెక్స్కి షుమెర్ సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో షుమెర్కి సోరోస్ ఫండింగ్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కమలా హారిస్,హిల్లరీ క్లింటన్, జో బైడెన్, జార్జ్ సోరోస్ డీప్ స్టేట్లో భాగమనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ఎన్నికైన తర్వాత కోర్టుల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్న రాడికల్ లెఫ్ట్ భావాలు ఉన్నవారిని తొలగిస్తానని ప్రకటించారు. వీటిని ఆధారంగా కొందరు ఈ వ్యవహారంలో రాజకీయ ఎజెండా ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తుంది.
- Tags
- Adani
- Donald Trump
- Joe Biden
- USA
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!