Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- చైనా ప్రాజెక్ట్ రక్షణ కోసమే ఇదంతా..
- చైనీయులను టార్గెట్ చేస్తూ బీఎల్ఏ దాడులు..
- సీపెక్ ప్రాజెక్టుకు బలూచిస్తాన్ కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా దాడులు పెరగడంపై, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ భద్రతా పరిస్థితిని చర్చించడానికి మంగళవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్లో సివిల్, మిలిటరీ అధికారులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశాన్ని నిర్వహించారు.
బలూచిస్తాన కేంద్రంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ (ఆత్మహత్య దళం), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF), మరియు బలూచ్ రాజీ ఆజోయ్ సంగర్ (BRAS)తో సహా బలూచిస్తాన్లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై సమగ్ర సైనిక చర్యను పాక్ ప్రభుత్వం ఆమోదించింది. పాక్ పౌరులతో పాటు విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో అభద్రతా భావం సృష్టించేందుకు శత్రు బాహ్య శక్తుల ఆదేశంతో ఈ సంస్థలు పనిచేస్తూ, దేశ ఆర్థిక పురోగతిని దెబ్బ తీస్తున్నాయని పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి షరీఫ్ కేబినెట్ సభ్యులు, ప్రావిన్షియల్ సీఎంలు, త్రివిధ సాయుధ సర్వీసుల చీఫ్లు హాజరయ్యారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
Read Also: Gautam Adani: ట్రంప్కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?
విస్తీర్ణంలో అతిపెద్ద ప్రాంతం, అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంగా బలూచిస్తాన్కి పేరుంది. ఈ ప్రావిన్సులో అపారమైన ఖనిజ, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటిని దోచుకుంటున్న పాక్ ప్రభుత్వానికి, చైనాకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని బలూచిస్తాన్ వేర్పాటువాదులు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు కలుగజేస్తుందని పాక్ ఆరోపిస్తోంది.
ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) వెళ్తోంది. ఈ ప్రాంతంలోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సును కలుపుతూ రోడ్లు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. తరుచుగా బీఎల్ఏ, ఇతన వేర్పాటువాద సంస్థలు ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న చైనా వ్యక్తుల్ని, పాక్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తోంది. ఒకానొక దశలో చైనా తమ పౌరుల భద్రతపై పాకిస్తాన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ దాడుల్ని తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!