Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- చైనా ప్రాజెక్ట్ రక్షణ కోసమే ఇదంతా..
- చైనీయులను టార్గెట్ చేస్తూ బీఎల్ఏ దాడులు..
- సీపెక్ ప్రాజెక్టుకు బలూచిస్తాన్ కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా దాడులు పెరగడంపై, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ భద్రతా పరిస్థితిని చర్చించడానికి మంగళవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్లో సివిల్, మిలిటరీ అధికారులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశాన్ని నిర్వహించారు.
బలూచిస్తాన కేంద్రంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ (ఆత్మహత్య దళం), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF), మరియు బలూచ్ రాజీ ఆజోయ్ సంగర్ (BRAS)తో సహా బలూచిస్తాన్లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై సమగ్ర సైనిక చర్యను పాక్ ప్రభుత్వం ఆమోదించింది. పాక్ పౌరులతో పాటు విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో అభద్రతా భావం సృష్టించేందుకు శత్రు బాహ్య శక్తుల ఆదేశంతో ఈ సంస్థలు పనిచేస్తూ, దేశ ఆర్థిక పురోగతిని దెబ్బ తీస్తున్నాయని పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి షరీఫ్ కేబినెట్ సభ్యులు, ప్రావిన్షియల్ సీఎంలు, త్రివిధ సాయుధ సర్వీసుల చీఫ్లు హాజరయ్యారు.
Also Read
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
Read Also: Gautam Adani: ట్రంప్కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?
విస్తీర్ణంలో అతిపెద్ద ప్రాంతం, అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంగా బలూచిస్తాన్కి పేరుంది. ఈ ప్రావిన్సులో అపారమైన ఖనిజ, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటిని దోచుకుంటున్న పాక్ ప్రభుత్వానికి, చైనాకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని బలూచిస్తాన్ వేర్పాటువాదులు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు కలుగజేస్తుందని పాక్ ఆరోపిస్తోంది.
ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) వెళ్తోంది. ఈ ప్రాంతంలోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సును కలుపుతూ రోడ్లు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. తరుచుగా బీఎల్ఏ, ఇతన వేర్పాటువాద సంస్థలు ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న చైనా వ్యక్తుల్ని, పాక్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తోంది. ఒకానొక దశలో చైనా తమ పౌరుల భద్రతపై పాకిస్తాన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ దాడుల్ని తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?