Supreme Court: కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది.. యాసిన్ మాలిక్ కేసులో వ్యాఖ్య
- కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది
- వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేర్పాటువాది యాసిన్మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాసిన్ మాలిక్ను కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలన్న ఆదేశాల మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయబద్ధంగానే జరిగింది కదా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
1990లో శ్రీనగర్లో నలుగురు ఎయిర్ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ కిడ్నాప్ కేసులో వేర్పాటువాది యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణకు మాలిక్ వ్యక్తిగతంగా హాజరుకావాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం జమ్మూ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. భద్రతా కారణాల రీత్యా మాలిక్ను జమ్మూకు తీసుకెళ్లలేమని.. సాక్ష్యుల భద్రత కూడా మాకు ముఖ్యమేనని పేర్కొన్నారు. గతంలో ఓ సాక్షిని హత్య చేశారని.. లాయర్ను పెట్టుకోకుండా మాలిక్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడని తెలిపారు. మాలిక్ సాధారణ క్రిమినల్ కాదని.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్తో అతడికి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. గతంలో చాలాసార్లు సయీద్ను కలిసేందుకు పాకిస్థాన్కు కూడా వెళ్లాడని.. ఇలాంటి కేసుల్లో మేం కేవలం పుస్తకాల్లో ఉన్నట్లు చేయలేమని సీబీఐ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maharashtra Elections: చరిత్ర సృష్టించిన “మహా” ఓటర్లు.. దశాబ్ధం తర్వాత ఎక్కువ ఓటింగ్ శాతం..
సీబీఐ సమాధానానికి ధర్మాసనం బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కోర్టుకు తీసుకెళ్లకపోతే వీడియో కాన్ఫరెన్స్లో క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలం? జమ్మూలో ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశాలు కల్పించాం’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..