Mumbai: ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులను రక్షించి మరోక బోటులోకి తీసుకువస్తున్న వీడియో వైరల్గా మారింది. పడవ సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతుండటం వీడియోలో చూడవచ్చు.
Pakistan: తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్ని బలవంతం చేస్తున్నారు.
పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.