Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!
- వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మిస్సింగ్
- 5 రోజులుగా తెలియని జాడ!.. పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వికలాంగుల కోటాను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో పూజాను జూలై 23 లోపు ఉత్తరాఖండ్లోని ముస్సోరీ శిక్షణా కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టు చేయలేదు. గడువు మంగళవారంతో ముగిసింది. పైగా యూపీఎస్సీ ఫిర్యాదుతో ఢిల్లీలో కేసు కూడా నమోదైంది. ఇంకోవైపు పూణె కలెక్టర్ వేధిస్తున్నారంటూ పూజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కూడా ఆమె వాంగ్మూలం తీసుకునేందుకు పూణె పోలీసులు ప్రయత్నిస్తుంటే.. దీనికి రెస్పాన్స్ లేదు. గత ఐదు రోజుల నుంచి పూజా ఆచూకీ లభించడం లేదని పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
మరోవైపు పూజా తల్లిదండ్రులు మనోరమా, దిలీప్ వైవాహిక స్థితిపై కేంద్రం ఆరా తీసింది. వారు కలిసి ఉన్నారా? లేదా విడిపోయారా? దీనిపై క్లారిటీ ఇవ్వాలని పూణె పోలీసులకు కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించేందుకు కూడా పూజా ఖేద్కర్ అందుబాటులోకి రాలేదు. ఇంటర్వ్యూలో ఆమె.. తల్లిదండ్రులు విడిపోయారని పూజా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పేరెంట్స్ వైవాహిక స్థితి తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: Bengaluru: అర్ధరాత్రి హస్టల్లోకి చొరబడి, యువతి గొంతు కోసి హత్య..
పూజా.. అతిగా ఊహించుకుని లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. ట్రైనీ ఐఏఎస్కు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె పూణె కలెక్టరేట్లో వసతులు కల్పించాలని సిబ్బందిని బెదిరించింది. దీంతో పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వాషిమ్కి బదిలీ చేశారు. అనంతరం రోజుకో ఆరోపణ రావడంతో వివాదాలు చుట్టుముట్టాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్ సర్టిఫికెట్ వరకు… రేషన్ కార్డు దగ్గర నుంచి వికలాంగ సర్టిఫికెట్ వరకు అన్ని తప్పుడు పత్రాలను సృష్టించి పూజా ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకేసారి అన్ని ఆరోపణలు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా యూపీఎస్సీ అప్రమత్తం అయ్యాయి. దర్యాప్తునకు ఆదేశించాయి. అంతేకాకుండా ఆమె శిక్షణ కాలాన్ని కూడా ఆపేశాయి. ఇంకోవైపు దర్యాప్తు సాగుతోంది. ఆమెకు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆస్పత్రులు కూడా సరిగ్గా స్పందించడం లేదని తెలుస్తోంది. ఇక విచారణలో ఆరోపణలు రుజువైతే పూర్తిగా ఆమె ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
తాజావార్తలు
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!