Rahul Gandhi: పార్లమెంట్లో రాహుల్ గాంధీని కలిసిన రైతు సంఘాల నేతలు..
- రాహుల్ గాంధీని కలిసిన రైతు సంఘాల నేతలు..
- మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్న రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మరోసారి తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతుల సంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ రోజు పార్లమెంట్ కాంప్లెక్స్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో రైతుల నేతలు భేటీ అయ్యారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. వీరితో పాటు ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, సుఖ్జిందర్ సింగ్ రంధావాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
అయితే, రైతుల్ని లోపలికి అనుమతించే విషయంలో గందరగోళం నెలకొంది. వారిని మేము ఆహ్వానించామని, కానీ వారిని పార్లమెంట్ లోపలికి అనుమతించలేదని, వారు రైతులు కావడం వల్లే లోపలికి అనుమతించడలేదు కావచ్చు, దీనికి కారణాన్ని ప్రధానినే అడగాలి అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో రైతుల సమస్యల్ని లేవనెత్తుతారని అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చెప్పారు. ఢిల్లీకి వచ్చి రైతులు నిరసన తెలిపేందుకు అన్ని హక్కుల ఉన్నాయని, అవసరమైతే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెడగామని ఆయన అన్నారు.
రైతు సంఘాల నేతల్లో ఒకరైన జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి పాదయాత్రగా వస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మల్ని తగలబెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాయి.
कुछ किसान मुझसे मिलना चाहते थे, इसलिए मैंने उन्हें अंदर ऑफिस में बुलाया था।
लेकिन उन्हें अंदर आने नहीं दिया गया, इसका कारण आपको प्रधानमंत्री से पूछना पड़ेगा।
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 संसद परिसर, नई दिल्ली pic.twitter.com/jbidAjAFqV
— Congress (@INCIndia) July 24, 2024
తాజావార్తలు
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!