Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురికాగా.. కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెంటచింతలలో వైసీపీ నేత దారుణ హత్య:
పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. రెంటచింతల నుంచి రెంటాల వెళ్లే మార్గంలో పులోళ్ల బావి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య:
మరోవైపు కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా (37) హత్యకు గురయ్యారు. మాసుంబాషా దర్గా సమీపంలో టీడీపీకి చెందిన షేక్ జవాజ్, వైసీపీకి చెందిన ఇర్ఫాజ్తో ఇంతియాజ్కు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం జవాజ్, ఇర్ఫాజ్ కలిసి ఇంతియాజ్పై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతియాజ్, జవాజ్-ఇర్ఫాజ్ మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన ఇర్ఫాజ్ గతంలో ఓ బంగారు వ్యాపారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
పల్నాడు, కర్నూలులో జరిగిన ఈ రెండు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు హత్యకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు కేసుల్లోనూ హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర, రాజకీయ కారణాలున్నాయా లేదా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!