Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురికాగా.. కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెంటచింతలలో వైసీపీ నేత దారుణ హత్య:
పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. రెంటచింతల నుంచి రెంటాల వెళ్లే మార్గంలో పులోళ్ల బావి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య:
మరోవైపు కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా (37) హత్యకు గురయ్యారు. మాసుంబాషా దర్గా సమీపంలో టీడీపీకి చెందిన షేక్ జవాజ్, వైసీపీకి చెందిన ఇర్ఫాజ్తో ఇంతియాజ్కు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం జవాజ్, ఇర్ఫాజ్ కలిసి ఇంతియాజ్పై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతియాజ్, జవాజ్-ఇర్ఫాజ్ మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన ఇర్ఫాజ్ గతంలో ఓ బంగారు వ్యాపారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
పల్నాడు, కర్నూలులో జరిగిన ఈ రెండు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు హత్యకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు కేసుల్లోనూ హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర, రాజకీయ కారణాలున్నాయా లేదా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!