Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి..
- ట్రంప్ సంచలన ప్రతిపాదన..
- స్వాగతించిన ఇజ్రాయిల్, హమాస్ వ్యతిరేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: హమాస్-ఇజ్రాయిల్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపుగా ఏడాదిన్నర పాటు సాగిన గాజా యుద్ధానికి తాత్కాలిక విరామం లభించినట్లైంది. సంధిలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 90 మంది ఇజ్రాయిలీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లను ఈజిప్టు, జోర్డా్న్ తీసుకోవాలనే ఆలోచనను శనివారం ముందుకు తెచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనను ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి జెజలెన్ స్మోట్రిక్ స్వాగతించారు. మరోవైపు హమాస్, ఇస్లామిక్ జిహాద్ సహా పాలస్తీనయన్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Guillain-Barre Syndrome: గులియన్ బారే సిండ్రోమ్(GBS)తో పూణేలో తొలి మరణం..
పాలస్తీనియన్లను గాజా నుంచి తరలించడంపై తాను జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో మాట్లాడానని శనివారం ట్రంప్ అన్నారు. ఈజిప్ట్ కూడా గాజా ప్రజల్ని తీసుకోవాలని కోరుకుంటున్నానని, ట్రంప్ కోరారు. ‘‘గాజాలో దాదాపుగా అన్నీ కూల్చివేయబడ్డాయి. అక్కడ ప్రజలు చినపోతున్నారు. కాబట్టి నేను కొన్ని అరబ్ దేశాలతో కలిసి, వారు శాంతియుతంగా జీవించేందుకు పలు ప్రదేశాల్లో గృహాలు నిర్మించాలని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు. ఆదివారం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసితో మాట్లాడనున్నట్లు తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యల్ని ఇజ్రాయిల్ స్వాగితించింది. మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి వారికి ఇతర ప్రదేశాలు కనుగొనడం గొప్ప ఆలోచన అని చెప్పింది. ట్రంప్ ఆలోచన దుర్మార్గమైనదని హమాస్, ఇతర పాలస్తీనా గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజా వాసుల్ని జోర్డార్, ఈజిప్ట్ తరలించే ట్రంప్ ఆలోచనల్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు హమాస్ చెప్పింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని హతమార్చి, 200 మందికి పైగా ప్రజల్ని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై భీకరదాడి చేసింది. ఈ దాడుల్లో 47000 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!