India-Russia Relations: ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తి..
- మోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహం..
- బయటికి చెప్పకున్నా లోలోపట రగిలిపోతున్న యూఎస్..
- నాటో సమ్మిట్ సమయంలోనే మోడీ-పుతిన్ భేటీ కావడంపై ఆందోళన..
- ఏ రోజైనా రష్యా చైనా పక్షాల నిలుస్తుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Russia Relations: ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహంతో ఉందని బ్లూమ్బర్గ్ నివేదించింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యాలో పలు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మోడీ రష్యాకు వెళ్లడంతో ఆ దేశం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మోడీకి, రష్యా ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది.
Read Also: Raghunandan Rao: పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలి..
Also Read
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
ఇదిలా ఉంటే, మోడీ రష్యా పర్యటన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే సత్తా ప్రధాని మోడీ ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. బయటకు ఎన్నో చెబుతున్నప్పటికీ నాటో సమావేశం వేళ ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు. ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ రష్యాలో తొలిసారిగా పర్యటించడంపై అమెరికా-భారత్ సన్నిహిత సంబంధాలపై అమెరికా ప్రభుత్వం లోపల , వెలుపల విమర్శలకు దారితీసిందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ-పుతిన్ భేటీ నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో జరగకుండా రీ షెడ్యూల్ చేస్తారని ఆశిస్తున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్బెల్ జూలై ప్రారంభంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో మాట్లాడారని నివేదిక చెప్పింది.
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. మాస్కోతో న్యూ ఢిల్లీకి ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను అమెరికా గుర్తిస్తుందని, రష్యా-చైనా మధ్య సంబంధాలను నిరోధించాలని కోరుకుంటున్నట్లు క్యాంప్బెల్ క్వాత్రాతో చెప్పినట్లు తెలిపింది. నాటో సమ్మిట్ సమయంలో పుతిన్ని మరింత ఒంటరిగా చేయాలని భావిస్తున్న తరుణంలో, మోడీ రష్యాలో ఉండటంతో యూఎస్-ఇండియా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జెక్ సల్లివాన్ మాట్లాడుతూ.. భారత్ దీర్ఘకాలిక, నమ్మకమైన భాగస్వామిగా రష్యాను కొనియాడటం మంచిది కాదని హెచ్చరించారు. రష్యా చైనాకు దగ్గర అవుతోందని, నిజానికి చైనాకి జూనియర్ పార్ట్నర్గా మారుతోందని ఆయన అన్నారు. భారత్పై చైనా దురాక్రమణలో రష్యా ఏ రోజైనా చైనా పక్షాన నిలిచే అవకాశం ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!