US Elections: కమలా హారిస్ కోసం తమిళనాడు, ట్రంప్ కోసం ఆంధ్ర ప్రదేశ్..
- తమిళ.. తెలుగు రాష్ట్రాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్..
- కమలా హారిస్ కోసం తమిళనాడు.. ట్రంప్ కోసం ఏపీ..
- ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య ఉషాకి ఏపీతో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే. అధికార డెమెక్రాట్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ నిలబడ్డారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆమెకు ఈ అవకాశం దక్కింది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరుపును డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉండగా, ఆయనకు వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ పోటీలో ఉన్నారు.
కమలా హారిస్తో పాటు జేడీ వాన్స్కి భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి. కమలా హారీస్ పూర్వీకులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కాగా, జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ప్రెసిడెంట్ కావాలని తమిళనాడు కోరుకుంటుంటే, ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచి ఆయనకు వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ కావాలని ఏపీ కోరుకుంటోంది. దీంతో ఇరువురు కోసం అటు తమిళనాడు, ఇటు ఏపీల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read
Read Also: J&K Terror Attacks: ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్లో కేంద్రం సమాధానం..
ఏపీలో హిందూ పూజారి సుబ్రమణ్య శర్మ జేడీ వాన్స్ గెలుపుకోసం పూజలు చేశారు. సాయిబాబా విగ్రహం వద్ద ఆయన వైస్ ప్రెసిడెంట్ కావాలని ప్రార్థనలు చేశారు. జేడీ వాన్స్ భార్య ఉష ఇద్దరూ మేల్ లా స్కూల్లో తొలిసారి కలుసుకున్నారు. 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిజానికి ఉషా ఇప్పటి వరకు తన పూర్వీకుల గ్రామమైన వడ్లూరికి రాలేదు. చివరిసారిగా ఉషా తండ్రి మూడేళ్ల క్రితం వచ్చారు. ఊష వాన్స్ తాతలది పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూర్. కాగా, ఆమె తాత చెన్నై వెళ్లి స్థిరపడగా, ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిలయ్యారు.
మరోవైపు ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ తాతల స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం. ఆమె తాత పీవీ గోపాలన్ దశాబ్ధాల క్రితం ఈ గ్రామాని వదిలి అమెరికా వెళ్లారు. కానీ ఆమె కుటుంబం ఇప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తోంది. గ్రామంలో గుడి కోసం రెగ్యులర్గా దానాలు చేస్తుంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలతో పాటు తమిళనాడు కమలాహారిస్ని సొంత మనిషిలా చూస్తోంది. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఊర్లో ఆమెకు సంబంధించి బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆమె గెలుపుకోసం పూజలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!