Online Love: ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి.. ఇక్కడే బిగ్ ట్విస్ట్..
- ప్రియురాలి కోసం పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి..
- పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన బాదల్ బాబు..
- అరెస్ట్ చేసిన పాకిస్తాన్ అధికారులు..
- పెళ్లి చేసుకునే ఆసక్తి లేదన్న ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహౌద్దీన్ జిల్లాలో అరెస్టయ్యాడు. సనాని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే బాబు సరిహద్దు దాటాడు.
ఇదిలా ఉంటే, బాబుని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రియురాలు సనా రాణి పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ‘‘బాబు, తాను రెండున్నరేళ్లుగా ఫేస్బుక్ స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునే ఆసక్తి తనకు లేదని ఆమె పోలీసులకు చెప్పింది’’ అని పంజాబ్ సీనియర్ పోలీస్ అధికారి నసీర్ షా గురువారం చెప్పారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
బాబు అక్రమంగా సరిహద్దు దాటి బహౌద్దీన్లోని సనా రాణి ఉంటున్న మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. బాబు రాణిని కలిశారా..? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. రాణి పోలీసులు ఒత్తిడికి తలొగ్గి, స్టేట్మెంట్ ఇచ్చిందా.. అనేది ధ్రువీకరించబడలేదు. బాబుతో రాణికి ఉన్న సంబంధాల గురించి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాబుపై పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13, 14 కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో సరిహద్దు దాటిన అనేక ప్రేమ వ్యవహరాలు వార్తల్లో అంశాలుగా నిలిచాయి. సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ఇష్టపడి సరిహద్దులు దాటుతున్నారు. గతంలో అంజు అనే భారతీయ మహిళ, తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆమె ఇస్లాంలోకి మారి నస్రుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్, తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా ఇండియా వచ్చింది. గతేడాది 19 ఏళ్ల పాకిస్తానీ యువతి ఇక్రా జివానీ 25 ఏళ్ల ములాయం సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక్రా, ములాయం సింగ్ నేపాల్లో వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..