Amit Shah: బీహార్ను యూపీఏ నాశనం చేస్తే.. ఎన్డీఏ అభివృద్ధి చేసింది.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్య
- బీహార్ను యూపీఏ నాశనం చేస్తే.. ఎన్డీఏ అభివృద్ధి చేసింది
- లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీపై అమిత్ షా విమర్శలు
- బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా.. లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్గంజ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. జంగిల్ రాజ్ కావాలా? డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా? బీహార్ ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలిస్తోందని.. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. గతంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బీహార్ను నాశనం చేశారని విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేయలేనిది.. కేవలం 10 ఏళ్లలోనే మోడీ అభివృద్ధి చేసి చూపించారన్నారు. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. ఐదేళ్లలో బీహార్ను వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని… 13 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ. 8,000 కోట్లతో ఏడు వంతెనలను నిర్మిస్తామని.. బీహార్లో ఒక మఖానా బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan : కమల్ హాసన్ అందరి ముందే నన్ను తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ప్రస్తుతం లాలూ తనయులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని.. కుమార్తె ఏమో పార్లమెంట్లో ఉన్నారని.. భార్య ఏమో శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారని.. ఇలా కుటుంబాన్ని పదవుల్లో సెట్ చేసే పనిలో లాలూ బిజీగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం యువకులు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిందని.. బీహార్లో కూడా సీతకు మాతా జానకికి ఆలయాన్ని నిర్మించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని అమిత్ షా అన్నారు.
ఇది కూడా చదవండి: Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!