Amit Shah: బీహార్ను యూపీఏ నాశనం చేస్తే.. ఎన్డీఏ అభివృద్ధి చేసింది.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్య
- బీహార్ను యూపీఏ నాశనం చేస్తే.. ఎన్డీఏ అభివృద్ధి చేసింది
- లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీపై అమిత్ షా విమర్శలు
- బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా.. లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్గంజ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. జంగిల్ రాజ్ కావాలా? డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా? బీహార్ ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలిస్తోందని.. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. గతంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బీహార్ను నాశనం చేశారని విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేయలేనిది.. కేవలం 10 ఏళ్లలోనే మోడీ అభివృద్ధి చేసి చూపించారన్నారు. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. ఐదేళ్లలో బీహార్ను వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని… 13 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ. 8,000 కోట్లతో ఏడు వంతెనలను నిర్మిస్తామని.. బీహార్లో ఒక మఖానా బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan : కమల్ హాసన్ అందరి ముందే నన్ను తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రస్తుతం లాలూ తనయులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని.. కుమార్తె ఏమో పార్లమెంట్లో ఉన్నారని.. భార్య ఏమో శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారని.. ఇలా కుటుంబాన్ని పదవుల్లో సెట్ చేసే పనిలో లాలూ బిజీగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం యువకులు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిందని.. బీహార్లో కూడా సీతకు మాతా జానకికి ఆలయాన్ని నిర్మించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని అమిత్ షా అన్నారు.
ఇది కూడా చదవండి: Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్!
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!