Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్!
- ఓడిశాలో రైలు ప్రమాదం
- బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి.
- తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు ధృవీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: ఓడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి. ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు. పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్లు అని అధికారాలు తెలిపారు. ఘటనకు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
Read Also: SRH-HCA: సన్రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలపై స్పందించిన హెచ్సీఏ!
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల రూట్ను మార్చారు. మళ్లీ ట్రాక్ పునరుద్ధరించే వరకు కొన్ని రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసింది. దిగ్విజయ్ ప్రాంతానికి చెందిన టెలిఫోన్ నంబర్ 8991124238 ను అందుబాటులో ఉంచారు. ఈ మధ్య కాలంలో ఓడిశాలో రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శాలిమార్-చెన్నై కొరొమండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా, 1,200 మందికిపైగా గాయపడ్డారు. ఇంతక ముందు 2022లో, కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని బలంగా ఢీకొంది. ఆ ఘటనలో రెండు మంది మరణించగా, 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
ఇప్పటివరకు జరిగిన తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించేందుకు రైల్వే ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. రైల్వే మార్గం పునరుద్ధరించేందుకు ప్రమాద సహాయ బృందాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..