Wayanad: వయనాడ్లో ప్రియాంక గాంధీకి మద్దతుగా యూడీఎఫ్ ఎన్నికల ప్రచారం..
- కేరళలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్..
- నేడు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ సమావేశాలు..
- ప్రియాంక గాంధీ గెలుపే లక్ష్యంగా పని చేయనున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు కే. సుధాకరన్, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి సహా ప్రముఖ నేతలు పాల్గొంటారు.
Also Read
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
అయితే, అక్టోబర్ 25 నాటికి అన్ని పంచాయతీ ఎన్నికల కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు భావిస్తున్నారు. అగ్ర నేతల నేతృత్వంలో ఈ నెల 26, 27 తేదీల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే, నియోజకవర్గ ఎన్నికల కమిటీలను సైతం ఏర్పాటు చేయనున్నారు. సుల్తాన్ బతేరి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకుడు డీన్ కురియాకోస్ నేతృత్వంలో పంచాయతీ సమావేశాలు కంప్లీట్ అయింది. రానున్న రోజుల్లో కల్పేటలో ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, ఎంపీ రాజ్మోహన్ ఉన్నితన్ నేతృత్వంలో మనంతవాడి పంచాయతీలో కమిటీలు వేసేందుకు సమావేశం కానున్నారు.
Read Also: Bomb Threat: మరోసారి ఢిల్లీ-లండన్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
ఇక, రాహుల్ గాంధీకి మద్దతు పలికిన వయనాడ్ ప్రజలు మరోసారి ప్రియాంక గాంధీకి చారిత్రాత్మక మెజారిటీ ఇవ్వడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక, భారత ఎన్నికల సంఘం ఇటీవల 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. వయనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!