The Lancet Report: దేశంలో పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు.. లాన్సెట్ నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు. 35.5 శాతం మంది అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నట్లు నివేదించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి ఈ అధ్యయాన్ని నిర్వహించాయి. అన్ని రాష్ట్రాల్లోని భౌగోళిక పరిస్థితులు, జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దశలవారీగా పరిశోధకులు అధ్యయనం చేశారు. 2008-2020 మధ్యకాలంలో దేశంలోని 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రజల్లో బీపీ, షుగర్ వ్యాధులు పెరుగుతున్నట్లు తేటతెల్లం అయింది.
Read Also: Good news : కేంద్రం అదిరిపోయే న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ.6వేలు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ప్రి-డయాబెటిస్( షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి) స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయంతో బాధపడుతున్నారని, 39.5 శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 81.2 శాతం ప్రజల్లో డిస్లిపిడేమియా( లిపిడ్స్ లో అసమతుల్యత) ఉందని నివేదికలో వెల్లడైంది. దేశంలో షుగర్, ఇతర సంక్రమిత వ్యాధుల బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉందని, అభివృద్ధి చెందిన రాస్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకరస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!