Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు…
Diabetes Symptoms: షుగర్ వ్యాధి.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ప్రధానంగా దీనిని చెప్పవచు. ఈ షుగర్ వ్యాధి ప్రారంభ దశల్లో చాలా మంది వ్యక్తులకు ఈ వ్యాధి ఉందని తెలుసుకోవాదం చాలా ఆలశ్యం అవుతుంది. ఎందుకంటే.. లక్షణాలు కాస్త సున్నితంగా ఉంటాయి. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. వీటిని సమయానికి గమనిస్తే, చికిత్స తీసుకొని మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇక షుగర్ వ్యాధి అనేది శరీరంలోని…
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా…
నేటి బిజీ లైఫ్ లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నారు. హ్యూమన్ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వేళకు నిద్రాహారాలు తీసుకోవడం మానేశారు. దీంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో డయాబెటిస్ ఒకటి. నేటి కాలంలో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. డయాబెటిస్ను అదుపులో ఉంచేందుకు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ,మందుల…
Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను…
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య.
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23…