Delhi: అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఎల్జీ ఉక్కుపాదం..
- అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఉక్కుపాదం..
- చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎల్జీ ఆదేశం..
- వలసదారుల్ని వెళ్లగొట్టాలని ఇటీవల ఎల్జీని కోరిన ముస్లిం నేతలు..
- బంగ్లాదేశ్ హిందువుల అణిచివేత సమయంలో చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై అణిచివేత వేళ ఈ ఆదేశాలు వచ్చాయి. ఇటీవల దర్గా హజ్రల్ నిజాముద్దీన్, బస్తీ హజ్రల్ నిజాముద్దీన్కి చెందిన ముస్లిం కమ్యూనిటీల నాయకుల బృందం ఎల్జీ వీకే సక్సేనాని కలిశారు. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులపై చర్యలు తీసుకోవాలని వారంతా ఎల్జీని కోరారు. ఈ కోరిక మేరకు దేశరాజధానిలో బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Read Also: AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం
అంతేకాకుండా..‘‘ అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇళ్లు అద్దుకు ఇవ్వొద్దని, ఏ సంస్థలో ఉపాధి ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆధార్, ఓటర్ ఐడీలను రద్దు చేయాలని కోరారు’’. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఎల్జీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెండు రోజుల పాటు ప్రత్యేకమైన డ్రైవ్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, గుడులు, ఇళ్లు ఇలా అన్నింటిపై మతోన్మాద మూకలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా హక్కుల కోసం నినదించిన హిందూ నాయకులపై దేశద్రోహం కేసులు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేసింది. ఇతడి అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మరోవైపు అక్కడి రాడికల్ ముస్లిం నేతలు ఇండియాని రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!