సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా పరువు నష్టం కేసులో విధించిన శిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు సమర్థించింది.
Delhi Excise Policy: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమతి ఇచ్చారు.
ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి అరుదైన ప్రశంసలు దక్కాయి. అరవింద్ కేజ్రీవాల్ కంటే అతిషీ వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసించారు.
సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మద్దతుగా నిలిచారు. ఆమెకు జరిగిన సంఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు.
మహిళా కమిషన్లోని 223 మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో ఈ నియామకాలు నిబంధనలను ఉల్లంఘించాయని గవర్నర్ అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే మహిళా కమిషన్ ను మూసివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంపై స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, కమిషన్లో 90…
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పొలిటికల్ దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే జైల్లో నుంచి కేజ్రీవాల్ పరిపాలించడం కుదరని వీకే సక్సేనా వ్యాఖ్యానించారు.