Demonetisation: పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది.
నోట్ల రద్దు విషయంపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 7న తీర్పును రిజర్వ్ చేసింది. నోట్ల రద్దు ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నిర్దేశించిన అధికారాలు, విధానానికి విరుద్ధమని వాదనలు జరిగాయి. నోట్ల రద్దుపై ఏర్పడిన అత్యున్నత సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.
Also Read
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
Read Also: Train Derail: పట్టాలు తప్పిన ముంబై-జోధ్పూర్ రైలు..
నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలకు, బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టాలని నవంబర్ 8, 2016లో బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం, 1934లోని సెక్షన్ 26 (2) ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును చేపట్టింది. ఈ నిర్ణయం తరువాతి రోజు నుంచి రూ.500, రూ.1000 రద్దు చేయబడ్డాయి. ఈ నోట్లను డిసెంబర్ 30, 2016 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూ. 17.97 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంది. నోట్ల రద్దుతో రద్దు చేయబడిని కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 15.31 లక్షల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ల తరుపున పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే యోచన, టెర్రర్ ఫండింగ్, బ్లాక్ మనీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది. గతంలో 1946, 1978లో ఇలాంటి నోట్ల రద్దు జరిగింది.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో