Demonetisation: పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది.
నోట్ల రద్దు విషయంపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 7న తీర్పును రిజర్వ్ చేసింది. నోట్ల రద్దు ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నిర్దేశించిన అధికారాలు, విధానానికి విరుద్ధమని వాదనలు జరిగాయి. నోట్ల రద్దుపై ఏర్పడిన అత్యున్నత సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
Read Also: Train Derail: పట్టాలు తప్పిన ముంబై-జోధ్పూర్ రైలు..
నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలకు, బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టాలని నవంబర్ 8, 2016లో బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం, 1934లోని సెక్షన్ 26 (2) ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును చేపట్టింది. ఈ నిర్ణయం తరువాతి రోజు నుంచి రూ.500, రూ.1000 రద్దు చేయబడ్డాయి. ఈ నోట్లను డిసెంబర్ 30, 2016 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూ. 17.97 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంది. నోట్ల రద్దుతో రద్దు చేయబడిని కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 15.31 లక్షల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ల తరుపున పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే యోచన, టెర్రర్ ఫండింగ్, బ్లాక్ మనీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది. గతంలో 1946, 1978లో ఇలాంటి నోట్ల రద్దు జరిగింది.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!