Ranya Rao Case: రన్యా రావు కేసులో కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమేయం..!
- రన్యా రావు కేసులో కీలక పరిణామం..
- కీలక విషయాన్ని వెల్లడించిన ఎస్కార్ట్ ఇచ్చిన అధికారి..
- పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకే చేశానని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారి కూతురు కావడం, హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రన్యా రావు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బంగారాన్ని తీసుకువచ్చినట్లు తేలింది. ఎయిర్ పోర్టులో వీఐపీ ప్రోటోకాల్ని రన్యా రావు దుర్వినియోగం చేసినట్లు డీఆర్ఐ అధికారులు ఆరోపించారు. రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి స్వయంగా ఇమ్మిగ్రేషన్కి వెళ్లి, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యారావు లగేజీని తీసుకుంటున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో తనిఖీలను దాటేసి స్మగ్లింగ్కి పాల్పడింది.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Waqf: “ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం” వక్ఫ్ ఆస్తి.. ఎంఐఎం నేత క్లెయిమ్..
అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘‘డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించామని డీఆర్ఐ అధికారుల ముందు పోలీస్ అధికారి అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకే ప్రోటోకాల్ మంజూరు వారు అంగీకరించారు’’ అని డీఆర్ఐ తరుపున వాదించిన స్పెషల్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) మధురావు కోర్టుకు తెలిపారు.
ఈ సంఘటనలో రన్యా రావు సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి, ప్రస్తుత డీజీపీ కే.రామచంద్రారావు ప్రమేయం ఉందా..? అనే దానిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్భంగా రన్యా రావు బెయిల్ పిటిషన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. రూ 50 లక్షలకు మించి కస్టమ్ సుంకం ఎగవేత తీవ్రమైన నేరంగా చెప్పారు. ఇది కస్టమ్స్ చట్టంలోని క్షన్ 135(1)(ఎ) మరియు (బి) కిందకు వస్తుందని, దీనిని శిక్షించదగిన మరియు బెయిల్ ఇవ్వలేని నేరంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!