Ranya Rao Case: రన్యా రావు కేసులో కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమేయం..!
- రన్యా రావు కేసులో కీలక పరిణామం..
- కీలక విషయాన్ని వెల్లడించిన ఎస్కార్ట్ ఇచ్చిన అధికారి..
- పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకే చేశానని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారి కూతురు కావడం, హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రన్యా రావు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బంగారాన్ని తీసుకువచ్చినట్లు తేలింది. ఎయిర్ పోర్టులో వీఐపీ ప్రోటోకాల్ని రన్యా రావు దుర్వినియోగం చేసినట్లు డీఆర్ఐ అధికారులు ఆరోపించారు. రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి స్వయంగా ఇమ్మిగ్రేషన్కి వెళ్లి, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యారావు లగేజీని తీసుకుంటున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో తనిఖీలను దాటేసి స్మగ్లింగ్కి పాల్పడింది.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Waqf: “ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం” వక్ఫ్ ఆస్తి.. ఎంఐఎం నేత క్లెయిమ్..
అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘‘డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించామని డీఆర్ఐ అధికారుల ముందు పోలీస్ అధికారి అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకే ప్రోటోకాల్ మంజూరు వారు అంగీకరించారు’’ అని డీఆర్ఐ తరుపున వాదించిన స్పెషల్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) మధురావు కోర్టుకు తెలిపారు.
ఈ సంఘటనలో రన్యా రావు సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి, ప్రస్తుత డీజీపీ కే.రామచంద్రారావు ప్రమేయం ఉందా..? అనే దానిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్భంగా రన్యా రావు బెయిల్ పిటిషన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. రూ 50 లక్షలకు మించి కస్టమ్ సుంకం ఎగవేత తీవ్రమైన నేరంగా చెప్పారు. ఇది కస్టమ్స్ చట్టంలోని క్షన్ 135(1)(ఎ) మరియు (బి) కిందకు వస్తుందని, దీనిని శిక్షించదగిన మరియు బెయిల్ ఇవ్వలేని నేరంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..