UP CM Yogi: ఔరంగజేబుని ఆరాధించే వారు, షాజహాన్ గతిని ఎదుర్కోవాలి..
- పిచ్చివారే ఔరంగజేబుని ఆరాధిస్తారు..
- మొఘల్ పాలకుడిని కొలిచే వారు షాజహాన్ గతి ఎదుర్కోవాలి..
- యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ ఇటీవల ఔరంగజేబుని కీర్తించడం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలోనే యోగి నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అబూ అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.
Also Read
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కతిని నమ్మని వారు, వాటికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు ఎవరినైతే కీర్తిస్తున్నారో వారి గతిని చూడాలని అన్నారు. మానసిక వికలాంగులు అయిన వ్యక్తి మాత్రమే ఔరంగజేబుని ఆదర్శవంతమైన వ్యక్తిగా భావిస్తారని చెప్పారు. తెలివైన ఏ వ్యక్తి కూడా క్రూరమైన పాలకుడిని గౌరవించరని అన్నారు. ‘‘ఎవరైనా ఔరంగజేబుని నమ్మితే, తన సొంత కొడుకుకు ఔరంగజేబు పేరు పెట్టాలి. ఔరంగజేబు తండ్రి షాజహాన్ ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని తీవ్రంగా వ్యతిరేకించారు.
Read Also: Kakani Govardhan Reddy: జగన్ వద్ద ఎలాంటి కొటరీలు లేవు..
ఔరంగజేబు గురించి షాజహాన్ రచనలను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. ‘‘ఔరంగజేబు లాంటి దౌర్భాగ్యుడు ఎవరికీ ఉండకూడదని షాజహాన్ స్వయంగా తన జీవిత చరిత్రలో రాసినప్పుడు, ఔరంగజేబు గురించి మనం ఇతరుల నుండి ఎందుకు వినాలి? హిందూ మతానికి చెందిన కుమారులు మంచివాడని, ఎందుకంటే అతను తన తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు సేవ చేస్తాడు, వారు మరణించిన తర్వాత వారి ఆత్మలకు ఆరాధిస్తాడు అని ఆయన విలపించారు. కానీ నువ్వు ఔరంగజేబు, నన్ను దాహంతో చనిపోయేలా వదిలేశావు’’ అని షాజహాన్ రచనల్ని యోగి ప్రస్తావించారు.
ఔరంగజేబు అధికారంలో కోసం తండ్రి షాజహాన్ని ఆగ్రా కోటలో బంధించడంతో పాటు ఆయన సోదరుడు దారాషికోని అత్యంత దారుణంగా తల నరికి చంపాడు. ఆ తర్వాత షాజహాన్ని కోటలో బంధించి ప్రతీ 24 గంటకు చిన్న కుండలో నీటిని మాత్రమే ఇచ్చేవారు. చివరి రోజుల్లో ఎంతో బాధను అనుభవించి షాజహాన్ మరణించాడు.
తాజావార్తలు
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
-
Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!