UP CM Yogi: ఔరంగజేబుని ఆరాధించే వారు, షాజహాన్ గతిని ఎదుర్కోవాలి..
- పిచ్చివారే ఔరంగజేబుని ఆరాధిస్తారు..
- మొఘల్ పాలకుడిని కొలిచే వారు షాజహాన్ గతి ఎదుర్కోవాలి..
- యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ ఇటీవల ఔరంగజేబుని కీర్తించడం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలోనే యోగి నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అబూ అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కతిని నమ్మని వారు, వాటికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు ఎవరినైతే కీర్తిస్తున్నారో వారి గతిని చూడాలని అన్నారు. మానసిక వికలాంగులు అయిన వ్యక్తి మాత్రమే ఔరంగజేబుని ఆదర్శవంతమైన వ్యక్తిగా భావిస్తారని చెప్పారు. తెలివైన ఏ వ్యక్తి కూడా క్రూరమైన పాలకుడిని గౌరవించరని అన్నారు. ‘‘ఎవరైనా ఔరంగజేబుని నమ్మితే, తన సొంత కొడుకుకు ఔరంగజేబు పేరు పెట్టాలి. ఔరంగజేబు తండ్రి షాజహాన్ ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని తీవ్రంగా వ్యతిరేకించారు.
Read Also: Kakani Govardhan Reddy: జగన్ వద్ద ఎలాంటి కొటరీలు లేవు..
ఔరంగజేబు గురించి షాజహాన్ రచనలను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. ‘‘ఔరంగజేబు లాంటి దౌర్భాగ్యుడు ఎవరికీ ఉండకూడదని షాజహాన్ స్వయంగా తన జీవిత చరిత్రలో రాసినప్పుడు, ఔరంగజేబు గురించి మనం ఇతరుల నుండి ఎందుకు వినాలి? హిందూ మతానికి చెందిన కుమారులు మంచివాడని, ఎందుకంటే అతను తన తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు సేవ చేస్తాడు, వారు మరణించిన తర్వాత వారి ఆత్మలకు ఆరాధిస్తాడు అని ఆయన విలపించారు. కానీ నువ్వు ఔరంగజేబు, నన్ను దాహంతో చనిపోయేలా వదిలేశావు’’ అని షాజహాన్ రచనల్ని యోగి ప్రస్తావించారు.
ఔరంగజేబు అధికారంలో కోసం తండ్రి షాజహాన్ని ఆగ్రా కోటలో బంధించడంతో పాటు ఆయన సోదరుడు దారాషికోని అత్యంత దారుణంగా తల నరికి చంపాడు. ఆ తర్వాత షాజహాన్ని కోటలో బంధించి ప్రతీ 24 గంటకు చిన్న కుండలో నీటిని మాత్రమే ఇచ్చేవారు. చివరి రోజుల్లో ఎంతో బాధను అనుభవించి షాజహాన్ మరణించాడు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..