టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సరికొత్త కష్టాలు మొదలైనట్లు సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Aamir Khan : బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఇదే..
ఏంటా కష్టాలు అంటే.. ఈ మూవీని కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఎస్ కె జి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే, వీరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు లీగల్గా ఒకరిపై మరొకరు ఫైట్ చేస్తున్నారట. కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ‘జటాధర’ చిత్రానికి సంబంధించి 50 శాతం హక్కులు తమకు ఇచ్చారని.. ఎస్ కె జి సంస్థ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ అగ్రీమెంట్ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేస్తున్నారట. ఇక అగ్రిమెంట్ ప్రకారం కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, 50 శాతం వాటా ఇవ్వాలి.. కానీ వారు ఇప్పటికీ కేవలం రూ.60 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారట. దీంతో ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చాలా ఆలస్యం అయ్యింది.