Post Mortem: పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది..
- పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది
- యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసిన ఘటన
- చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి
- వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్న ఆస్పత్రి సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసింది. పోస్ట్మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఔట్ సోర్సింగ్కి చెందిన ఉద్యోగిని పట్టుకున్నారు. లోపల ఉంచిన నకిలీ ఆభరణాల ఫొటో, వీడియోతో సహా మొత్తం రహస్యాన్ని బయటపెట్టింది. ఈ ఉదాంతంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగులే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని, ఆభరణాల పరిమాణం ప్రకారం వాటా విభజించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందులో వైద్యుల ప్రమేయం లేదని తెలిపింది.
Om Birla: లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
Also Read
ఏప్రిల్ 9న తన అక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని.. పోలీసు లైన్లో ఉన్న నిక్కీ అనే మహిళా కానిస్టేబుల్ జూన్ 17న సీఎంఓకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టంలో సోదరి మృతదేహం నుంచి చెవిపోగులు, ముక్కుపుడక కనిపించలేదని తెలిపింది. ఈ క్రమంలో.. సీఎంఓ కమిటీ వేసి విచారణ జరిపింది. కమిటీ ఔట్సోర్సింగ్ కంపెనీ ద్వారా పోస్ట్ చేయబడిన వార్డ్ బాయ్ రూపేష్ పటేల్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగి వాహిద్ను దోషిగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. వారిద్దరినీ తొలగించారు. అయితే వార్డ్ బాయ్ని ఇరికించడంతో అతను సంచలన రహస్యాన్ని బట్టబయలు చేశాడు. సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆధునిక పోస్ట్మార్టం హౌస్లో భద్రపరిచిన కృత్రిమ ఆభరణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి.. డెడ్ బాడీపై ఏమైనా ఆభరణాలు కనిపిస్తే చోరీకి గురవుతున్నట్లు తెలిపాడు. మృతదేహాలపై నగలు చాలా వరకు వారి కుటుంబ సభ్యులే బయటకు తీస్తున్నప్పటికీ.. ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించినప్పుడు, మరణించిన వారికి ఉంగరాలు లేదా గొలుసులు.. మహిళలకు చెవిపోగులు, ముక్కు ఉంగరాలు, చీలమండలు మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో.. పోస్ట్ మార్టం సిబ్బంది వాటిని తొలగించి, వాటి స్థానంలో నకిలీ నగలు పెడుతున్నారని తెలిపాడు.
Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్లో ఐదుగురు మృతి..
వార్డ్ బాయ్ చెప్పిన ప్రకారం.. వార్డ్ బాయ్స్ చిన్న నగలు, పోస్ట్ మార్టం చేసేవారు పెద్ద నగలు తీసుకునేవారని చెప్పాడు. గొలుసు, ఉంగరం, చెవిపోగులు, తదితర పెద్ద ఆభరణాలను పోస్టుమార్టం సిబ్బంది తీసుకెళ్లే వారని తెలిపాడు. అయితే.. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని వార్డ్ బాయ్ చెబుతున్నాడు. మొత్తం ఎపిసోడ్పై.. ఈ కేసులో దోషులుగా తేలిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సిఎంఓ డాక్టర్ రోహ్తాష్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!