Post Mortem: పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది..
- పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది
- యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసిన ఘటన
- చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి
- వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్న ఆస్పత్రి సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసింది. పోస్ట్మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఔట్ సోర్సింగ్కి చెందిన ఉద్యోగిని పట్టుకున్నారు. లోపల ఉంచిన నకిలీ ఆభరణాల ఫొటో, వీడియోతో సహా మొత్తం రహస్యాన్ని బయటపెట్టింది. ఈ ఉదాంతంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగులే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని, ఆభరణాల పరిమాణం ప్రకారం వాటా విభజించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందులో వైద్యుల ప్రమేయం లేదని తెలిపింది.
Om Birla: లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఏప్రిల్ 9న తన అక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని.. పోలీసు లైన్లో ఉన్న నిక్కీ అనే మహిళా కానిస్టేబుల్ జూన్ 17న సీఎంఓకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టంలో సోదరి మృతదేహం నుంచి చెవిపోగులు, ముక్కుపుడక కనిపించలేదని తెలిపింది. ఈ క్రమంలో.. సీఎంఓ కమిటీ వేసి విచారణ జరిపింది. కమిటీ ఔట్సోర్సింగ్ కంపెనీ ద్వారా పోస్ట్ చేయబడిన వార్డ్ బాయ్ రూపేష్ పటేల్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగి వాహిద్ను దోషిగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. వారిద్దరినీ తొలగించారు. అయితే వార్డ్ బాయ్ని ఇరికించడంతో అతను సంచలన రహస్యాన్ని బట్టబయలు చేశాడు. సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆధునిక పోస్ట్మార్టం హౌస్లో భద్రపరిచిన కృత్రిమ ఆభరణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి.. డెడ్ బాడీపై ఏమైనా ఆభరణాలు కనిపిస్తే చోరీకి గురవుతున్నట్లు తెలిపాడు. మృతదేహాలపై నగలు చాలా వరకు వారి కుటుంబ సభ్యులే బయటకు తీస్తున్నప్పటికీ.. ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించినప్పుడు, మరణించిన వారికి ఉంగరాలు లేదా గొలుసులు.. మహిళలకు చెవిపోగులు, ముక్కు ఉంగరాలు, చీలమండలు మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో.. పోస్ట్ మార్టం సిబ్బంది వాటిని తొలగించి, వాటి స్థానంలో నకిలీ నగలు పెడుతున్నారని తెలిపాడు.
Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్లో ఐదుగురు మృతి..
వార్డ్ బాయ్ చెప్పిన ప్రకారం.. వార్డ్ బాయ్స్ చిన్న నగలు, పోస్ట్ మార్టం చేసేవారు పెద్ద నగలు తీసుకునేవారని చెప్పాడు. గొలుసు, ఉంగరం, చెవిపోగులు, తదితర పెద్ద ఆభరణాలను పోస్టుమార్టం సిబ్బంది తీసుకెళ్లే వారని తెలిపాడు. అయితే.. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని వార్డ్ బాయ్ చెబుతున్నాడు. మొత్తం ఎపిసోడ్పై.. ఈ కేసులో దోషులుగా తేలిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సిఎంఓ డాక్టర్ రోహ్తాష్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!