Post Mortem: పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది..
- పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది
- యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసిన ఘటన
- చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి
- వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్న ఆస్పత్రి సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసింది. పోస్ట్మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఔట్ సోర్సింగ్కి చెందిన ఉద్యోగిని పట్టుకున్నారు. లోపల ఉంచిన నకిలీ ఆభరణాల ఫొటో, వీడియోతో సహా మొత్తం రహస్యాన్ని బయటపెట్టింది. ఈ ఉదాంతంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగులే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని, ఆభరణాల పరిమాణం ప్రకారం వాటా విభజించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందులో వైద్యుల ప్రమేయం లేదని తెలిపింది.
Om Birla: లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఏప్రిల్ 9న తన అక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని.. పోలీసు లైన్లో ఉన్న నిక్కీ అనే మహిళా కానిస్టేబుల్ జూన్ 17న సీఎంఓకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టంలో సోదరి మృతదేహం నుంచి చెవిపోగులు, ముక్కుపుడక కనిపించలేదని తెలిపింది. ఈ క్రమంలో.. సీఎంఓ కమిటీ వేసి విచారణ జరిపింది. కమిటీ ఔట్సోర్సింగ్ కంపెనీ ద్వారా పోస్ట్ చేయబడిన వార్డ్ బాయ్ రూపేష్ పటేల్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగి వాహిద్ను దోషిగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. వారిద్దరినీ తొలగించారు. అయితే వార్డ్ బాయ్ని ఇరికించడంతో అతను సంచలన రహస్యాన్ని బట్టబయలు చేశాడు. సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆధునిక పోస్ట్మార్టం హౌస్లో భద్రపరిచిన కృత్రిమ ఆభరణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి.. డెడ్ బాడీపై ఏమైనా ఆభరణాలు కనిపిస్తే చోరీకి గురవుతున్నట్లు తెలిపాడు. మృతదేహాలపై నగలు చాలా వరకు వారి కుటుంబ సభ్యులే బయటకు తీస్తున్నప్పటికీ.. ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించినప్పుడు, మరణించిన వారికి ఉంగరాలు లేదా గొలుసులు.. మహిళలకు చెవిపోగులు, ముక్కు ఉంగరాలు, చీలమండలు మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో.. పోస్ట్ మార్టం సిబ్బంది వాటిని తొలగించి, వాటి స్థానంలో నకిలీ నగలు పెడుతున్నారని తెలిపాడు.
Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్లో ఐదుగురు మృతి..
వార్డ్ బాయ్ చెప్పిన ప్రకారం.. వార్డ్ బాయ్స్ చిన్న నగలు, పోస్ట్ మార్టం చేసేవారు పెద్ద నగలు తీసుకునేవారని చెప్పాడు. గొలుసు, ఉంగరం, చెవిపోగులు, తదితర పెద్ద ఆభరణాలను పోస్టుమార్టం సిబ్బంది తీసుకెళ్లే వారని తెలిపాడు. అయితే.. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని వార్డ్ బాయ్ చెబుతున్నాడు. మొత్తం ఎపిసోడ్పై.. ఈ కేసులో దోషులుగా తేలిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సిఎంఓ డాక్టర్ రోహ్తాష్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..