Post Mortem: పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది..
- పోస్ట్మార్టంలో డెడ్ బాడీ మీదున్న నగలు మాయం చేస్తున్న సిబ్బంది
- యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసిన ఘటన
- చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి
- వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్న ఆస్పత్రి సిబ్బంది
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసింది. పోస్ట్మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఔట్ సోర్సింగ్కి చెందిన ఉద్యోగిని పట్టుకున్నారు. లోపల ఉంచిన నకిలీ ఆభరణాల ఫొటో, వీడియోతో సహా మొత్తం రహస్యాన్ని బయటపెట్టింది. ఈ ఉదాంతంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగులే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని, ఆభరణాల పరిమాణం ప్రకారం వాటా విభజించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందులో వైద్యుల ప్రమేయం లేదని తెలిపింది.
Om Birla: లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ఏప్రిల్ 9న తన అక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని.. పోలీసు లైన్లో ఉన్న నిక్కీ అనే మహిళా కానిస్టేబుల్ జూన్ 17న సీఎంఓకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టంలో సోదరి మృతదేహం నుంచి చెవిపోగులు, ముక్కుపుడక కనిపించలేదని తెలిపింది. ఈ క్రమంలో.. సీఎంఓ కమిటీ వేసి విచారణ జరిపింది. కమిటీ ఔట్సోర్సింగ్ కంపెనీ ద్వారా పోస్ట్ చేయబడిన వార్డ్ బాయ్ రూపేష్ పటేల్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగి వాహిద్ను దోషిగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. వారిద్దరినీ తొలగించారు. అయితే వార్డ్ బాయ్ని ఇరికించడంతో అతను సంచలన రహస్యాన్ని బట్టబయలు చేశాడు. సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆధునిక పోస్ట్మార్టం హౌస్లో భద్రపరిచిన కృత్రిమ ఆభరణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి.. డెడ్ బాడీపై ఏమైనా ఆభరణాలు కనిపిస్తే చోరీకి గురవుతున్నట్లు తెలిపాడు. మృతదేహాలపై నగలు చాలా వరకు వారి కుటుంబ సభ్యులే బయటకు తీస్తున్నప్పటికీ.. ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించినప్పుడు, మరణించిన వారికి ఉంగరాలు లేదా గొలుసులు.. మహిళలకు చెవిపోగులు, ముక్కు ఉంగరాలు, చీలమండలు మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో.. పోస్ట్ మార్టం సిబ్బంది వాటిని తొలగించి, వాటి స్థానంలో నకిలీ నగలు పెడుతున్నారని తెలిపాడు.
Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్లో ఐదుగురు మృతి..
వార్డ్ బాయ్ చెప్పిన ప్రకారం.. వార్డ్ బాయ్స్ చిన్న నగలు, పోస్ట్ మార్టం చేసేవారు పెద్ద నగలు తీసుకునేవారని చెప్పాడు. గొలుసు, ఉంగరం, చెవిపోగులు, తదితర పెద్ద ఆభరణాలను పోస్టుమార్టం సిబ్బంది తీసుకెళ్లే వారని తెలిపాడు. అయితే.. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని వార్డ్ బాయ్ చెబుతున్నాడు. మొత్తం ఎపిసోడ్పై.. ఈ కేసులో దోషులుగా తేలిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సిఎంఓ డాక్టర్ రోహ్తాష్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో