Anakapalli Blast: అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, రాజమండ్రి ఆస్పత్రికి వచ్చిన కేఏ పాల్.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు..
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్లో వెలుగు చూసింది. పోస్ట్మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ…
ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Death Celebrations: ఓ మహిళ చనిపోయింది.. అందరూ విషాదంలో ఉన్నారు.. కొందరైతే ఆగకుండా కన్నీళ్లుపెట్టుకుని ఏడుస్తున్నారు. ఇంతలో ఆ గుంపులోనుంచి ఓ నలుగురు లేచి ముందుకు వచ్చారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.…
రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. మితిమీరిన వేగం, కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మేడ్చల్ జిల్లాలో చెక్ పోస్ట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మరణించారు. అదుపు తప్పి డివైడర్ ని గుద్దుకుంది మారుతీ ఈకో వాహనం. ఈ వాహనంలో తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ఇంకొకరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని గోరి సింఘ్, బబ్లీ సింఘ్ గా గుర్తించారు. మేడ్చల్…