Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..
- ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన అస్సాం సీఎం..
- రైట్-వింగ్ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారన్న హిమంత..
- ‘‘నేషన్ ఫస్ట్’’ విధానాన్ని ఈ దాడులు ఏం చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంపై ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. నిన్న పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై 20 ఏళ్ల థామస్ మథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు బుల్టెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లింది. స్వల్పంగా గాయమైంది. ఈ దాడిలో ఇద్దరు గాయపడగా, ఒకరు మరణించారు. దాడి తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ నిందితుడిని హతమార్చారు.
Read Also: Vivek Ramaswamy: “ట్రంప్ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇదిలా ఉంటే, ఈ దాడిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా రైట్-వింగ్ నాయకులు క్రియాశీలక లక్ష్యాలుగా ఉన్నారని అన్నారు. రాడికల్ లెఫ్ట్ వీరిని టార్గెట్ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ దాడులు ‘‘ దేశం మొదలు’’ అనే సిద్ధాంతాన్ని ఓడించలేదని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మితవాద నాయకులు ఇప్పుడు రాడికల్ లెఫ్ట్ క్రియాశీలక లక్ష్యాలుగా ఉన్నారు. అయితే ఈ దాడులు ‘‘నేషన్ ఫస్ట్’’అనే భావజాలాన్ని ఓడించలేదు. ఇది లోతైన ఆధ్యాత్మికతలో పాతుకుపోయింది. సనాతన తత్వశాస్త్రం నుంచి ప్రేరణ పొందింది. ‘జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసీ’ ’’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్టాండ్ విత్ ట్రంప్, నేషన్ ఫస్ట్ హ్యాష్ ట్యాగ్లను జోడించారు.
ట్రంప్పై జరిగిన దాడిని ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ‘‘ నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో మరియు ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ మోడీ ఎక్స్లో ట్వీట్ చేశారు.
Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…
— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?